తెలంగాణాకు CJP ’స్కూల్ ఠీక్ కరో’ సెగ?

CJP నడుపుతున్న స్కూల్ ఠీక్ కరో ఉద్యమ సెగ తెలంగాణా సర్కారును తాకినట్లుంది. ఎక్కువ జిల్లాల్లో కలెక్టర్లు బడిబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల విద్యార్థుల స్థితిగతులు బోధనా పద్ధతులు, తరగతి గదులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలకు 100 డ్యూయల్ డేస్కు బెంచీలను మంజూరు చేయించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామన్నారు.


