ఓటరు నమోదుకు మంచి అవకాశం

AP : గుంటూరు జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు తమ వివరాలు చూసుకొని, కొత్తగా పేరు నమోదుకు, మార్పులు చేర్పులకు 6, 7, 8 ఫారాలు ఇచ్చి సరిచేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.



