గ్రామాన్ని పచ్చదనంతో నింపేసిన జనం

TG : నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింతాల గ్రామంలో 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ ఆవరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్, టీచర్లు, స్టూడెంట్స్, ఉపాధి హామీ కూలీలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.




