అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

AP: శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రేగిడి మండలం తునివాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం రాజాం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.




