← Back to news

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

By K. RAJASHEKAR· 21 Aug 2026· Kamareddy, Kamareddy, Kamareddy
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

TG: జోన్-III ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో చర్చించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల ఏర్పాటును పెంచాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

More in Local