‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరణ

TG: జగిత్యాల జిల్లా ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకుడు దామెర రామ్ సుధాకర్రావు మాట్లాడుతూ సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 23న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.


