BJPకి SHOCK..ప్రశాంత్ కిశోర్ గెలుపు

మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బిహార్ రాష్ట్రంలోని బంకిపూర్ సీటు బీజేపీ చేజారింది. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఇక్కడ విజయం సాధించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత జరిగిన బైఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను ఓడించి ఆయన గెలుపొందారు. ఎన్నికల ప్రచారం నుంచే దూకుడు పెంచిన ప్రశాంత్ కిశోర్ బిహార్ ప్రభుత్వం మార్పు కోరుతోందని, బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.


