భూ రీసర్వే, గృహ నిర్మాణంపై మంత్రి సమీక్ష

TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో చేపడుతున్న భూ రీసర్వే, గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల పనితీరును సమీక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.



