ప్రభుత్వం నిద్రపోతోందా..యువతి సూటి ప్రశ్న
‘మా నాన్న, మా ఊరిలోని మనుషులంతా బీజేపీ వాళ్లు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ బీజేపీ నేతలే. మా ఇంట్లో అందరితో యుద్ధం చేయాల్సి వస్తోంది. యూపీ..ఆగ్రా నుంచి పారిపోయి రావాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పడుకుంటోందా?’ అంటూ ఓ యువతి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ అవకతవకలకు నిరసనగా దిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో మాస్క్ వేసుకుంది పాల్గొంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆక్రోశించింది.


