← Back to news

ల్యాండ్ కొన్నంత మాత్రాన సిటిజన్ అయిపోరు: హైకోర్టు

By sahani· 17 Jul 2026· Kolkata
ల్యాండ్ కొన్నంత మాత్రాన సిటిజన్ అయిపోరు: హైకోర్టు

ఇండియాలో భూమి కొన్నంత మాత్రాన ఇక్కడి పౌరుడిగా ఒప్పుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. చొరబాటు ఆరోపణలతో వెస్ట్ బెంగాల్ పోలీసులు నసీర్ మొల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాను బెంగాల్‌లో ల్యాండ్ కొన్నానని, కాబట్టి ఇండియన్ సిటిజన్నే అని అతను కోర్టులో వాదించాడు. కానీ ల్యాండ్ డాక్యుమెంట్లు పౌరసత్వాన్ని రుజువు చేయలేవని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇండియన్ అని నిరూపించుకునే మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి జూలై 20 వరకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.

More in Legal