ఆగస్టు 30, 31 తేదీల్లో KVPS జిల్లా శిక్షణా తరగతులు

కుల వివక్ష లేని సమాజం, సామాజిక న్యాయం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 30, 31 తేదీలలో 'జిల్లా సామాజిక శిక్షణా తరగతులు' నిర్వహించనున్నారు. ఈ తరగతులను జయప్రదం చేయాలని KVPS ప్రతినిధులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ హాజరుకానున్నారు. KVPS వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు రాయల్స్ నవీన్ కుమార్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.


