స్కూల్ కి కలెక్టర్ విజిట్.. 100 బెంచీలు మంజూరు

TG : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. క్లాస్ రూమ్లను చూసి, పిల్లల చదువులు, ఉపాధ్యాయులు చెప్పే విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు 100 డ్యూయల్ డెస్క్ బెంచీలను మంజూరు చేశారు. Govt స్కూళ్లను బాగు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో MPDOతో పాటు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు..


