తండ్రి బాటలోనే సోనమ్ వాంగ్చుక్

లడాఖ్కు ఎస్టీ హోదా సాధించడం కోసం 1984లో సోనమ్ వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ఐదు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఉద్యమం పెద్దది కావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా లేహ్కు వచ్చి ఆయనకు జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎస్టీ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తండ్రి బాటలోనే ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ కూడా ప్రస్తుతం అదే రీతిలో సీజేపీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.


