గురజాడ అప్పారావు.. సాహిత్యంతో సమాజాన్ని మార్చిన రచయిత

తెలుగు భాషకు కొత్త గుర్తింపు తెచ్చిన గురజాడ అప్పారావును గుర్తు చేసుకుందాం. 1862 సెప్టెంబర్ 21న జన్మించిన ఆయన తన రచనల ద్వారా.. సమాజంలోని సమస్యలను ప్రశ్నించారు. ‘కన్యాశుల్కం’లో చైల్డ్ మ్యారేజెస్, డౌరీ వంటి సోషల్ ఇష్యూస్ను చూపించారు. ప్రజలు మాట్లాడే సింపుల్ భాషను తన రచనల్లో ఉపయోగించారు. ‘దేశమును ప్రేమించుమన్నా’ అంటూ దేశభక్తి సందేశాన్ని అందించారు. ఆయన రచనలు, ఆలోచనలు నేటి తరానికీ చేరుతున్నాయి. తెలుగు సాహిత్యంపై గురజాడ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.



