Latest

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Local· 2d ago

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

ఖమ్మం జిల్లా వేంసూరులో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. SIR 2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై ఆయన దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల వివరాలు, బీఎల్ఓల పరిశీలన చేశారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

పదిరలో భర్త చేత భార్య హత్య.. అత్తపై కూడా దాడి!
Crime· 2d ago

పదిరలో భర్త చేత భార్య హత్య.. అత్తపై కూడా దాడి!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో దారుణం జరిగింది. భర్త పల్లపు సురేష్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో అత్త కూడా తీవ్రంగా గాయపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వృద్ధురాలిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

గోబర్ గ్యాస్ ప్లాంట్.. సూరారంలో దుర్వాసన ముప్పు!
Local· 2d ago

గోబర్ గ్యాస్ ప్లాంట్.. సూరారంలో దుర్వాసన ముప్పు!

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో కొత్తగా ప్రారంభమైన గోబర్ గ్యాస్ ప్లాంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు దుర్వాసన భరించలేనంతగా వస్తోంది. 40 శాతం పనులు మాత్రమే పూర్తయిన ఈ ప్లాంట్ 100 శాతం పూర్తయితే ఇంకా ఎంత భయంకరమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. NH 563 మీద ప్రయాణించే వారు, చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పశువులు, పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. PCB అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!
Local· 2d ago

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలానికి చెందిన ఓ పేద విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఆమె పేరు జిల్లెళ్ళ భవ్యతేజిని. నార్సింగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు జంగయ్య, పరిమళ రాణి. ఈ చిన్నారి బాక్సింగ్ రింగ్‌లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ షేక్‌పేట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఇప్పటివరకు ఆమె 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. పేదరికాన్ని జయించి.. ఇలా మెరవడం అద్భుతం కదూ! ఆమె ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!
Local· 2d ago

రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రీ-సర్వే పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షించారు. మొత్తం 83 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. మిగిలిన 36 గ్రామాల్లో పనులు 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, ఎంఆర్ఐ ఇందిర పాల్గొన్నారు.

హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!
Local· 2d ago

హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జనసేన కార్యకర్తలుపవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు, పాఠశాలలో స్టూడెంట్స్‌కు పండ్లు పంపిణీ చేశారు. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జియవొద్దీన్ అనే వీరాభిమాని రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కూతుళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, బాండ్లను కుటుంబానికి అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధి చల్లా శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని గుర్తు చేశారు.

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!
Local· 2d ago

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఆదిత్య, అమృత ఆసుపత్రుల MD ఎలుక దేవేందర్ రెడ్డి ఈ క్యాంప్‌కు శ్రీకారం చుట్టారు. డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ భరత్, డాక్టర్ గ్రీష్మ వైద్య పరీక్షలు చేశారు. రోగులకు ఉచిత షుగర్ టెస్ట్లు, అవసరమైన మందులు కూడా అందజేశారు. సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ-నవీన్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

మాధవరం కలాన్.. ప్రత్యేక మండలంగా డిమాండ్!
Local· 2d ago

మాధవరం కలాన్.. ప్రత్యేక మండలంగా డిమాండ్!

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఓ కొత్త డిమాండ్ వినిపిస్తోంది. మాధవరం కలాన్‌ను ప్రత్యేక మండలంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఊటుకూరు, బండమిదీగూడెం, కొండారం, చిత్తలూరు, వంగమర్తి, ఇటుకులపాడ్, ఓగోడు, నడిగూడెం.. ఇలా మొత్తం 9 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. మాజీ నీటిసంఘం చైర్మన్ దొంతురి యాదగిరి, యారాల మాధవరెడ్డి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి స్పందించి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్‌కి సిఫారసు చేశారు.

భీమదేవరపల్లిలో రీ-సర్వే.. అదనపు కలెక్టర్ తనిఖీ!
Local· 2d ago

భీమదేవరపల్లిలో రీ-సర్వే.. అదనపు కలెక్టర్ తనిఖీ!

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో రీ-సర్వే పనులు హడావిడిగా సాగుతున్నాయి. అదనపు కలెక్టర్ ఎన్. రవి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. సర్పంచ్ మాచర్ల కుమారస్వామితో కలిసి హద్దులు, రికార్డుల వివరాలు చెక్ చేశారు. నిబంధనల ప్రకారమే సర్వే చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!
Local· 2d ago

అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!

నిర్మల్ జిల్లా కోథల్‌గావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తికి చెందిన అస్థిపంజరం లభ్యమైంది. పుర్రెతో పాటు కేవలం రెండు, మూడు ఎముకలు మాత్రమే దొరికాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 4-5 నెలలుగా మానసిక స్థితి సరిగా లేని గుర్తుతెలియని వ్యక్తి ఆ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలంలో పంచనామా, స్పాట్ పీఎంఈ నిర్వహించిన పోలీసులు.. ఎముకలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం భద్రపరిచారు.

సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!
Local· 2d ago

సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ప్రత్యేక సదస్సు జరిగింది. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆందోళనగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అపరిచితుల లింకులు, కాల్స్‌పై క్లిక్ చేయొద్దు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు 1930కి కాల్ చేయాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ప్రకాష్, స్థానికులు పాల్గొన్నారు.

సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి!
Local· 2d ago

సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. “సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి” అంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో డీపీలు, స్టేటస్‌లు పెడుతున్నారు. రోడ్డుపైకి రాకుండా.. తమ విధులకు ఆటంకం లేకుండా సోషల్ మీడియానే ఆయుధంగా మార్చుకున్నారు. జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఈ ఆన్‌లైన్ నిరసన మొదలైంది. ఒక్కొక్కరిగా మొదలై.. ఇప్పుడు రాజోలు వ్యాప్తంగా వైరల్ అవ్తోంది. తమకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

క్లోరోక్విన్.. 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి!
Local· 2d ago

క్లోరోక్విన్.. 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక మండలంలో 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి చెందింది. ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆదివాసులు అస్వస్థతకు గురయ్యారన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. పోస్టుమార్టం నివేదిక రాకముందే జన్యు గుండె సమస్యల కారణాలను ప్రస్తావించడం సరికాదన్నారు. ఇది అధికారుల బాధ్యతను కప్పిపుచ్చే ప్రయత్నమేనన్నారు.

ఆత్మహత్యలు వద్దు.. రంగారెడ్డిలో ఎమ్మెల్యే హితబోధ!
Local· 2d ago

ఆత్మహత్యలు వద్దు.. రంగారెడ్డిలో ఎమ్మెల్యే హితబోధ!

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల ఒత్తిడికి గురై ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. బాధగా విద్యార్థులకు హితబోధ చేస్తూ.. ఒత్తిడికి లొంగొద్దని సూచించారు. నచ్చిన రంగాన్ని ఎంచుకుని రాణించాలని పిలుపునిచ్చారు. ఆశలు నెరవేరకపోతే ఆత్మహత్య సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరిత, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, చైర్మన్ అగ్గునూరు విశ్వం పాల్గొన్నారు

ANUలో జర్నలిజం అలుమ్ని సందడి!
Local· 2d ago

ANUలో జర్నలిజం అలుమ్ని సందడి!

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో జర్నలిజం పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. 2003లో ఈ కోర్సు మొదలైంది. ఇప్పుడు చాలామంది పెద్ద మీడియా హౌస్‌ల్లో పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థులు ఉద్వేగంగా మాట్లాడుతూ.. విలువలతో కూడిన జర్నలిజం ఎంతో అవసరమని అన్నారు. డిపార్ట్మెంట్ హెడ్ జ్యోతిర్మయి డిజిటల్ జర్నలిజంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ హెచ్వోడీలు సి.నారాయణరావు, ప్రొ.సుబ్రహ్మణ్యం, ప్రొ.శామ్యూల్, ప్రొ.మాణిక్యరావు పాల్గొన్నారు.

దాచేపల్లిలో పవన్ బర్త్డే సందడి!
Local· 2d ago

దాచేపల్లిలో పవన్ బర్త్డే సందడి!

పల్నాడు జిల్లా దాచేపల్లిలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ బర్త్డే జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కేక్ కట్ చేశారు. బంగ్లా సెంటర్, జమ్మిశెట్టి సెంటర్, మునగ బజార్, లైబ్రరీ సెంటర్.. ఇలా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. డీజే శబ్దాలు, బాణాసంచా సందడి మధ్య ర్యాలీలు నిర్వహించారు. పవన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.

గద్వాల పోలీస్ అసోసియేషన్.. నూతన కార్యవర్గం ఎన్నిక!
Local· 2d ago

గద్వాల పోలీస్ అసోసియేషన్.. నూతన కార్యవర్గం ఎన్నిక!

జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పోలీస్ కార్యాలయంలో జరిగాయి. జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సక్రమంగా పూర్తయింది. అధ్యక్షుడిగా బి.రఘుపతి నాయుడు, కార్యదర్శిగా టి.శేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.ప్రదీప్, బి.చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీగా ఎ.వై.ప్రసాద్, ట్రెజరర్‌గా శివకుమార్ ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భీమేష్, సభ్యులుగా యమ్మన్న, హనుమంతు, దివ్యవాణి, నాగమణి, గజేంద్ర, అంజనేయులు ఎన్నికయ్యారు.

కొబ్బరే కల్పవృక్షం.. కొత్తపేటలో అవగాహన!
Local· 2d ago

కొబ్బరే కల్పవృక్షం.. కొత్తపేటలో అవగాహన!

కోనసీమ జిల్లా కొత్తపేటలో ఓ ఆసక్తికరమైన ఈవెంట్ జరిగింది. అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవాన్ని వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.పి.రాజు మాట్లాడుతూ.. కొబ్బరి చెట్టును భూలోక కల్పవృక్షంగా అభివర్ణించారు. ’’ఏడాదికి ఎన్ని రోజులో.. అన్ని ప్రయోజనాలూ ఇందులో ఉన్నాయి. ఆహారం, ఆయుర్వేదం.. ఎక్కడ చూసినా కొబ్బరిదే సత్తా. నూనెలో ఔషధ గుణాలు.. కొబ్బరిలో వ్యర్థం అంటూ ఏదీ లేద’’ని ఆయన అన్నారు.. ఈ సందర్భంగా అధ్యాపకులు టి.రమాదేవి, జి.శ్రీనివాసులు, బి.విజయకుమార్, హేమలత పాల్గొన్నారు.

1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!
Local· 2d ago

1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ.. పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి మొదలైన ఈ ర్యాలీ.. 420 అడుగుల ఫ్లెక్సీతో కృష్ణవేణి చౌక్ వరకు సాగింది. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ధర్నా చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాల పూత అని నిరసన తెలిపారు.

డ్రాయింగ్ పోటీ.. నిర్మల్లో క్రమశిక్షణ పిలుపు!
Local· 2d ago

డ్రాయింగ్ పోటీ.. నిర్మల్లో క్రమశిక్షణ పిలుపు!

నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో డ్రాయింగ్ పోటీల సందడి! ఏకలవ్య ఫౌండేషన్, స్వప్న హాస్పిటల్ సౌజన్యంతో జెడ్పీహెస్ పాఠశాలలో ఈ ఈవెంట్ నిర్వహించారు. హెచ్ఎం రవీంద్ర కుమార్, ఫౌండేషన్ జిల్లా బాధ్యులు దిగంబరు స్టూడెంట్స్‌కి క్రమశిక్షణపై క్లాస్ ఇచ్చారు. విజేతలకు బహుమతులు కూడా అందించారు. భూమేశ్వరు, చైతన్య, ఎస్ఓ వీణ, చిన్నయ్య స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ స్కూల్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? జరుగుతున్నాయా? మాకు ఫొటో, వీడియో, వార్త పంపండి. మన ఈ యాప్ ద్వారా అందరికీ చెబుదాం.

SIRపై నిరసన.. ప్రకాశ్ రాజ్ అదుపులోకి!
National· 2d ago

SIRపై నిరసన.. ప్రకాశ్ రాజ్ అదుపులోకి!

బెంగళూరులో నటుడు ప్రకాశ్ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న SIR ప్రక్రియకు వ్యతిరేకంగా ఫ్రీడమ్ పార్క్‌ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ కార్యాలయం వరకు ‘ఎలక్షన్ కమిషన్ చలో’ పేరుతో మార్చ్‌ చేపట్టారు. ఈ నిరసనలో ప్రకాశ్ రాజ్‌తో పాటు నటుడు కిషోర్, పలు పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. SIRలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్రియను రద్దు చేయాలని, ఓటర్ల జాబితాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు