Crime

ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్
Crime· 23 Jul 2026

ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన యువకుడు, ఆత్మహత్యకు ముందు SIR ఫాం మీద రాసిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ప్రధాని మోడీ కారణమని పేర్కొన్నాడు. అలాగే తన కుటుంబసభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని కోరాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు
Crime· 23 Jul 2026

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు

తెలంగాణ రెడ్కో DE ముత్యం వెంకటరమణ అవినీతి కేసులో ACB అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు నాలుగు ఫ్లాట్లు, రెండు వాణిజ్య భవనాలు, రూ.52 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కిలోల బంగారం, విలువైన వాహనాలను సీజ్ చేశారు. సోదాల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ACB లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.27.65 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్
Crime· 23 Jul 2026

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

AP: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి రూ.15 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ AP, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. కడపకు చెందిన ఇద్దరు మహిళలను రూ.55 లక్షల నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.