Crime· 25 Jul 2026
దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు
NCRB నివేదిక ప్రకారం 2014 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 80 శాతం పెరిగి, 2014లో 8,068 నుంచి 2024లో 14,488కు చేరాయి. కుటుంబ సమస్యలు ప్రధాన కారణంగా నిలవగా, పరీక్షల్లో వైఫల్యం కారణంగా 25 వేలకుపైగా మంది ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న అకాడమిక్ ఒత్తిడి కూడా కీలక కారణంగా పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదుపరి స్థానాల్లో ఉన్నాయి.