Crime

పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్
Crime· 22 Jul 2026

పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో బీటెక్ విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న యువతి, లెక్చరర్స్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. గతంలో పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్ తీసుకెళ్లిన ఘటనతో పాటు, పరీక్షల సమయంలో తనపై పలు అనుమానాలతో కావాలనే నన్ను టార్గెట్ చేశారని పేర్కొంది. తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !
Crime· 20 Jul 2026

తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !

బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన తండ్రిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. తండ్రీ, కొడుకులిద్దరూ వేర్వేరు అపార్టుమెంటుల్లో వాచ్ మన్లుగా పనిచేస్తున్నారు. తండ్రి చంద్ర కొత్త జాబ్ వెతుక్కుంటూ కొడుకు చేరిన అపార్టుమెంటుకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.కోపం పట్టలేక కొడుకు ద్రోణ తండ్రిని ఇనుప రాడ్ తో కొట్టాడు. ఆ ముసలి తండ్రి ప్రాణం అక్కడే పోయింది. సమాచారం అందుకున్న లోకల్ పోలీస్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను అడ్డగించిన కానిస్టేబుల్ అరెస్ట్
Crime· 20 Jul 2026

బాలికను అడ్డగించిన కానిస్టేబుల్ అరెస్ట్

TG: నల్గొండ టౌన్‌లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది. గుర్రంపోడ్ PSలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్, సైకిల్‌పై వెళ్తున్న బాలికను అడ్డగించి, అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంటికి వెళ్లిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మాస్క్ ధరించి తిరిగినట్లు గుర్తించారు. ఆరోపణలు విచారణలో నిజం కావడంతో ఆయనను అరెస్టు చేశారు. అతడిపై గతంలో కూడా పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం.

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం
Crime· 20 Jul 2026

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం

TG: హైదరాబాద్ నగరం కాలాపత్తర్‌ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. శాలిబండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఫైజాన్(18) ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడకు వచ్చిన బాలాపూర్ రౌడీషీటర్ అబ్రార్‌, అతని స్నేహితులను తమ బస్తీకి ఎందుకు వచ్చారని ఫైజాన్ అడిగాడు. కోపానికి గురైన గ్యాంగ్ కత్తులతో ఫైజాన్ తల, కడుపులో దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఫైజాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్
Crime· 19 Jul 2026

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని సరస్వతినగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బూర్ల అనిల్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, హుండీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు రావడంతో అప్పుల పాలైన నిందితుడు డబ్బు కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి చోరీ చేసిన అతడిని CCTV దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం
Crime· 19 Jul 2026

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

TG: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఫీర్జాదిగూడలోని సమీపంలోని ఓ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకినట్లు గుర్తించారు. తేజస్విని మృతదేహం లభించగా, కేసులో విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో DRF సిబ్బంది బోట్ల సహాయంతో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె నెలకు దాదాపు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్, CCTV ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా
Crime· 19 Jul 2026

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా

TG: హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడకు చెందిన వెంకట్ రెడ్డి విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.4.64 లక్షలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం Naukri.comలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగా, దినేష్ మిట్టల్ అనే వ్యక్తి తనను నైకరీ గల్ఫ్ సర్వీస్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఖతర్ యూనివర్సిటీలో అధ్యాపకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పేరుతో పలుదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక ఉత్తర్వులు, ఖతర్ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఈమెయిల్ పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !
Crime· 18 Jul 2026

మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !

మీరట్ లో ఒక షాకింగ్ మర్డర్ ప్లాన్ బయటపడింది. దామిని అనే మహిళ తన భర్త అతుల్ పవార్ కి పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక బెడ్‌పై విష పూరిత పాము ని వదిలి కరిపించింది. ఈ క్రైమ్‌లో ఆమెకి తన లవర్ , స్కూల్ డ్రైవర్ తుషార్ హెల్ప్ చేశాడు. ₹20 లక్షల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేయడం, తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేయడమే వీరి మెయిన్ మోటివ్. అయితే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ,మొబైల్ రికార్డ్స్ పరిశీలించగా వీరికుట్ర బయటపడటంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భార్యా భర్తలిద్దరూ హస్తినాపూర్ లో కిడ్స్ ప్లే స్కూల్ ని నడుపుతున్నారు.

మెడికో, యువకుడు అనుమానాస్పద మృతి
Crime· 18 Jul 2026

మెడికో, యువకుడు అనుమానాస్పద మృతి

TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. కాలేజ్ హాస్టల్ నుంచి యువతి ఇంటికి వెళ్లిన అనంతరమే ఈ రెండు ఘటనలు జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వేధింపులా లేదా ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.