Crime· 20 Jul 2026
జాబ్ రావడంతో మారిన భర్త.. భార్యకు చిత్రహింసలు
TG: ఖమ్మం జిల్లా శంభునిగూడెంకు చెందిన సుమ(25)కు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం కొద్దిరోజులపాటు హైదరాబాద్లో ఉన్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, వరకట్నం తీసుకురావాలని వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఆమె గడ్డిమందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్వర్లు, ఆడబిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశారు.