Latest

మేమొచ్చాకా మహనీయుల పేర్లు పెట్టాం: ప్రధాని మోదీ
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏవియేషన్ రంగ అభివృద్ధిపై మాట్లాడారు. గతంలో నిర్మించిన ఎయిర్ పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టేవారని, తమ ప్రభుత్వం వచ్చాక దేశ మహనీయుల పేర్లను పెడుతోందని అన్నారు. అయోధ్య ఎయిర్ పోర్టుకి వాల్మీకి, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ఎయిర్ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని తెలిపారు.
నాన్న హెల్ప్ చేస్తారు కానీ!
తమిళనాడు CM విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన కెరీర్, డైరెక్షన్ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లెగసీ వల్ల ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని, అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటానని చెప్పారు. సొంతంగా నేమ్, ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవాలని నాన్న చెప్పారని, హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా అడగొచ్చని, కానీ స్పూన్ ఫీడింగ్ చేయనని విజయ్ స్పష్టం చేసినట్లు చెప్పారు. సొంత టాలెంట్ తో ఎక్స్పీరియన్స్ సాధిస్తూ ముందుకు వెళ్లడమే తన గోల్ అని సంజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఓటీటీలోకి అఖిల్ బ్లాక్బస్టర్ 'లెనిన్'..
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్' థియేటర్లలో సాలిడ్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారు త్వరలోనే ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.

Protection ఇస్తానని... Pocket ఖాళీ చేశాడా?
“ఫ్యూచర్ చెబుతానని... చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్యూచర్నే మార్చేశాడా?” 😳💸 కెనడాలో గంగాధర్ బాబు అనే 29 ఏళ్ల వ్యక్తి సైకిక్, స్పిరిచువల్ హీలర్గా చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుంచి $800,000కు పైగా తీసుకున్నట్లు టొరంటో పోలీసులు చెబుతున్నారు. మీకు, మీ ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం జరుగుతుందని భయపెట్టి, స్పిరిచువల్ ప్రొటెక్షన్ పేరుతో పదే పదే డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై కెనడా-వైడ్ వారెంట్ జారీ కాగా, అతడు భారత్కు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు
మహారాష్ట్రలో GSM ఫాయిల్స్ కంపెనీ MD మోహన్సింగ్ను చంపడానికి ఆయన బిజినెస్ పార్ట్నర్ 'సాగర్' ప్లాన్ చేశాడు. సాగర్ షేర్ మార్కెట్లో నష్టపోయి మోహన్సింగ్ దగ్గర 32 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టి, కంపెనీ మొత్తాన్ని లాక్కోవడానికే ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ మోహన్సింగ్ భుజానికి తగిలినా అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో ఉన్నాడు. CCTV కెమెరాల ఆధారంగా పోలీసులు సాగర్ను అతనికి సాయం చేసిన వాళ్లందరినీ అరెస్టు చేశారు.

శాండ్విచ్ను గన్ షేప్లో కొరికాడని సస్పెండ్!
శాండ్విచ్ను తుపాకీ ఆకారంలో కొరికి క్లాస్మేట్ వైపు చూపించాడనే రీజన్తో USలో ఓ 6 ఏళ్ల బాలుడిని స్కూల్ సస్పెండ్ చేసింది. జార్జియాలోని స్కూల్లో ఫస్ట్ గ్రేడ్ చదువుతున్న జాన్ మెడినా అనే చైల్డ్పై తీసుకున్న ఈ డిసిప్లినరీ యాక్షన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఆటిజమ్తో బాధపడుతున్న తమ బాబుపై స్కూల్ మేనేజ్మెంట్ తరచూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, 2023 నుంచి ఇప్పటివరకు 14 సార్లు సస్పెండ్ చేశారని బాలుడి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాతోనే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం: కేటీఆర్
సోషల్ మీడియా శక్తి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాకు హద్దు, పరిమితి ఉంటే బాగుంటుంది, కానీ ఆ హద్దులను ఎవరు నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. వార్తలలో పాజిటివ్, నెగెటివ్లు రాస్తూ, అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఆపకండి అని కోరే మీడియా కంటే, ప్రభుత్వాల జవాబుదారీతనానికి, ప్రజలకు స్వేచ్ఛగా సమాచారం అందించడానికి సోషల్ మీడియానే మెయిన్ ప్లాట్ఫామ్గా మారిపోయిందని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినం: ప్రధాని మోదీ
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. తరువాత జరిగిన బహిరంగ సభలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినమని అన్నారు. రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. అయన తన ప్రసంగాన్ని "అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో మొదలుపెట్టారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపైకి వచ్చే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి బంగారం దోచేశారు
TG: హైదరాబాద్లోని చందానగర్ బాలాజీ జ్యువెలరీ షాప్లో నిన్న అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు, తలుపుకు రంధ్రం చేసి సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తుండగా, CCTV ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

మహిళను వేధించిన SIకి షాక్
TG: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వేధింపులకు పాల్పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట SI కదిరే శ్రీకాంత్ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు 4నెలలుగా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సిమ్కార్డులు ధ్వంసం చేసి వైఫై ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, 14రోజుల రిమాండ్ విధించింది.

స్కూల్ డాబాపై యువకుడి దారుణ హత్య
AP: నెల్లూరు జిల్లా గూడూరు పక్కన ఉన్న విందూరులో ప్రైమరీ స్కూల్ డాబా మీద షాహుల్(21) అనే కుర్రాడు రక్తమడుగులో చనిపోయి వున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి. రక్తం ఎక్కువగా పోవడం వల్లే అతడు చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్న ఆధారాలు చూస్తుంటే ఎవరో గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

'కొరియన్ కనకరాజు' ట్రైలర్ : ఫన్ అండ్ హారర్ హంగామా!
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేశారు. థ్రిల్, హాస్యం, హారర్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ రితికా నాయక్, కామెడీ నటుడు సత్య తమ పాత్రలతో అలరించానున్నారు . తమన్ అందించిన మ్యూజిక్ హారర్, ఫన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

OUలో 'జెన్ జీ పోరుబాట' ప్రారంభం
TG: ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో జెన్ జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో "జెన్ జీ పోరుబాట" పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. సంఘం ఫౌండర్, ప్రెసిడెంట్ శివాజీ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, BPL ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ISROలో 410 అప్రెంటిస్ జాబ్స్
ISROలో జాబ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బెంగళూరులోని U.R రావు శాటిలైట్ సెంటర్లో 410 అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్స్కు 220, టెక్నీషియన్స్కు 120, కమర్షియల్ అప్రెంటిస్కు 70 పోస్టులున్నాయి. డిగ్రీ, డిప్లొమా, కామర్స్ అర్హత కలిగిన కాండిడేట్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది. కాండిడేట్లు NATS వెబ్సైట్లో ఆగస్ట్ 28 వరకు ఆన్లైన్లో <a href="https://nats.education.gov.in/">అప్లై </a>చేసుకోవచ్చు.

జొన్న రొట్టెలతో జీవితాన్నే మార్చేశారు
మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లకు చెందిన శ్రీనివాస్రెడ్డి, కవిత దంపతులు 50 పెట్టుబడితో ప్రారంభించిన జొన్నరొట్టెల వ్యాపారాన్ని విజయవంతమైన బ్రాండ్గా తీర్చిదిద్దారు. స్టార్టింగ్ల సైకిల్పై రొట్టెలు అమ్మిన వీరు, తర్వాత మిషిన్ కొనుగోలు చేసి వ్యాపారాన్ని విస్తరించారు. కరోనా టైమ్లో వ్యాపారం దెబ్బతిన్నా, కుమార్తె ఇషిక సలహాతో 'మన ఇంటి రోటీస్' పేరుతో ఆన్లైన్ విక్రయాలు ప్రారంభించారు. రోజుకు 3వేల రొట్టెలు విక్రయిస్తూ తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరుకు సరఫరా చేస్తున్నారు. నెలకు రూ.60వేల ఆదాయం పొందుతున్నారు.

గ్రీన్ స్క్రీన్ లేని రోజుల్లోనే అద్భుతం..
రామానంద్ సాగర్ 1987లో చేసిన ఐకానిక్ సీరియల్ 'రామాయణ్' మేకింగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్తో ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. నితేష్ తివారీ తీస్తున్న కొత్త 'రామాయణ్' మూవీ రాకముందే, రామానంద్ సాగర్ మనవడు శివ్ సాగర్ దీన్ని మన ముందుకు తెస్తున్నారు. ఆ రోజుల్లో గ్రీన్ స్క్రీన్లు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేకపోయినా, పరిమిత టెక్నాలజీతోనే రామానంద్ సాగర్ విజువల్ మ్యాజిక్ ఎలా చేశారో ఇందులో చూపించబోతున్నారు. 36 ఏళ్లు దాటినా ఈ సీరియల్ క్రేజ్ ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం.
నా సపోర్టర్స్పై EDని ఉసిగొల్పుతారు- అభిజిత్ దీప్కే
ఫుల్ టైమ్ పొలిటీషియన్ కావడం వల్ల ఉపయోగం లేదంటూ CJP లీడర్ అభిజిత్ దీప్కే ఇండియా టుడే ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను పోటీ చేస్తే ఓట్లు డిలీట్ చేస్తారు, నా వెనుక నిలిచే సపోర్టర్స్పై EDని ఉసిగొల్పుతారు. మన దేశంలో ఇదే రియాలిటీ. అందుకే పొలిటిక్స్ ద్వారా కాకుండా.. కేవలం పబ్లిక్ మూవ్మెంట్ (ప్రజా ఉద్యమం) ద్వారానే కంట్రీలో ఛేంజ్ సాధ్యమని, దానిపైనే వర్క్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

పుట్టిన బిడ్డను వదిలేసిన కన్న తల్లి
బెంగళూరు దగ్గరలోని దేవనహళ్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో పుట్టిన బాబును వదిలేసి ఓ తల్లి వెళ్లిపోయింది. వైద్యానికి డబ్బులు తెస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదు. ప్రస్తుతం బాబుకు చిక్కబళ్లాపూర్లో ఓ నర్సు సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఐడీ కార్డు ఆధారంగా ఆ మహిళది హవేరి జిల్లాగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి ఆమె కోసం వెతుకుతున్నారు.

బస్సు నడుపుతూ ఫోన్.. డ్రైవర్పై వేటు
AP: చిత్తూరు జిల్లా పలమనేరు-మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్ఫోన్ చూస్తున్న డ్రైవర్పై RTC యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి చేరగా, ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశించారు. విచారణ అనంతరం పలమనేరు డిపోకు చెందిన హైర్ సర్వీస్ బస్సు డ్రైవర్ కె. గణేష్కుమార్ను విధుల నుంచి తొలగించారు.

ఎర్రబస్సు కాదు.. ఎయిర్బస్సునే తెచ్చాం: రాంమోహన్ నాయుడు
AP: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని, 'ఎర్రబస్సు కాదు.. ఎయిర్బస్సు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దామని' అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారంలా మారుతుందని, దీని ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని విజన్–2047తో రాష్ట్రం ముందుకు వెళ్తుందని రాంమోహన్ నాయుడు తెలిపారు.
2028 నాటికి అమరావతి పనులు పూర్తి: చంద్రబాబు
AP: భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2028 కల్లా అమరావతి పనుల్లో మొదటి దశ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రధాని మోదీతో పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేయిస్తానని ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.