Latest

Coffee ఎప్పుడు తాగాలి?
నిద్ర లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకముందే కాఫీ కప్పు చేతిలోకి వచ్చేస్తుందా..? ☕😂 అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్. లేచిన వెంటనే మన బాడీలో కార్టిసోల్ లెవల్స్ ఎక్కువగా ఉండి సహజంగానే అలర్ట్గా ఉంచుతాయి. అందుకే లేచిన 60–90 నిమిషాల తర్వాత, సాధారణంగా ఉదయం 9–11 మధ్య కాఫీ తాగితే బెటర్ అని చెబుతున్నారు. అలాగే రోజుకు 400mg కెఫిన్ దాటకుండా చూసుకోవాలి. రాత్రి మంచి నిద్ర కావాలంటే బెడ్టైమ్కు 6–8 గంటల ముందే కాఫీకి బ్రేక్ ఇవ్వడం మంచిదట.

ఆకట్టుకుంటున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ డ్రోన్ విజువల్స్
AP: భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డ్రోన్ విజువల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీకి వెల్కమ్ పలికేందుకు ఎయిర్ పోర్టులో వేలాది మంది గిరిజన సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఒకే డ్రెస్ కోడ్తో వేలాది మంది కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్యం ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను వర్చువల్గా లాంచ్ చేసిన మోదీ
AP: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వేదిక నుంచి రాష్ట్రంలోని కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులను వర్చువల్గా లాంచ్ చేశారు. విశాఖపట్నం తర్లువాడలోని ASIP టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్, కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఇనాగరేట్ చేశారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ను వర్చువల్గా వర్చువల్గా లాంచ్ చేశారు.

ఓటీటీలో ఉన్నా థియేటర్లకే క్యూ
'ది ఇన్వైట్', 'అబ్సెషన్', 'మటీరియలిస్ట్స్' లాంటి హాలీవుడ్ సినిమాలు ఇప్పటి డేటింగ్స్, పెళ్లిళ్లలోని అసలు నిజాలను, రిలేషన్షిప్లలో ఉండే సమస్యలను చాలా నేచురల్గా చూపిస్తూ హిట్లుగా నిలుస్తున్నాయి. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, మనసుకి హత్తుకునేలా ఉండే ఇలాంటి కథలను పెద్ద తెరపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో 'ది ఇన్వైట్' లాంటి చిన్న హాలీవుడ్ మూవీ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

AI స్మార్ట్ అవుతోంది సరే... కంట్రోల్లో ఉందా? 👀
OpenAI తన AI ఏజెంట్స్పై చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని ఏజెంట్లు టెస్టింగ్ కోసం పెట్టిన హద్దులను దాటిన సందర్భాలు గుర్తించినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే అవి OpenAI నెట్వర్క్ను వదిలి బయటకు వెళ్లినట్లు ఆధారాలు లేవని, ఘటనలు కూడా లిమిటెడ్గానే ఉన్నాయని సమాచారం. ఇటీవల Hugging Face సిస్టమ్లోకి ఒక OpenAI ఏజెంట్ వెళ్లిన ఘటన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇప్పుడు పాత లాగ్స్ను కూడా చెక్ చేస్తూ అసలు ఎన్ని సార్లు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.

ఈ అరుదైన పెళ్లి చూశారా!
కేరళలో అత్యంత అరుదైన, ఆసక్తికరమైన వివాహం జరిగింది. అఖిల్ థామస్, నిఖిల్ థామస్ అనే కవల సోదరులు... మ్యాగీ మేరీ, మరియా మేరీ అనే కవల అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఏంటంటే... ఈ వివాహ వేడుకను జరిపించిన ప్రీస్ట్స్ ఆంటో, అజోలు కూడా కవలలే కావడం విశేషం! అంతేకాకుండా ఈ వెడ్డింగ్లో వారికి హెల్ప్ చేసిన అసిస్టెంట్లు కూడా కవల సోదరులే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లీక్ అనుకుంటే పొరపాటే.. వెలుగులోకి 'హైటెక్' మోసం!
పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని, అదొక హైటెక్ మోసమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. హర్యానాలోని భివానీ కేంద్రంగా నడుస్తున్న ఒక ముఠా ఈ స్కామ్ వెనుక ఉందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది మెయిన్ నిందితులు, 25 మంది కాండిడేట్స్, 8 మంది హ్యాండ్లర్లతో సహా మొత్తం 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న ఐదుగురి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

మేమొచ్చాకా మహనీయుల పేర్లు పెట్టాం: ప్రధాని మోదీ
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏవియేషన్ రంగ అభివృద్ధిపై మాట్లాడారు. గతంలో నిర్మించిన ఎయిర్ పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టేవారని, తమ ప్రభుత్వం వచ్చాక దేశ మహనీయుల పేర్లను పెడుతోందని అన్నారు. అయోధ్య ఎయిర్ పోర్టుకి వాల్మీకి, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ఎయిర్ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని తెలిపారు.
నాన్న హెల్ప్ చేస్తారు కానీ!
తమిళనాడు CM విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన కెరీర్, డైరెక్షన్ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లెగసీ వల్ల ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని, అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటానని చెప్పారు. సొంతంగా నేమ్, ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవాలని నాన్న చెప్పారని, హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా అడగొచ్చని, కానీ స్పూన్ ఫీడింగ్ చేయనని విజయ్ స్పష్టం చేసినట్లు చెప్పారు. సొంత టాలెంట్ తో ఎక్స్పీరియన్స్ సాధిస్తూ ముందుకు వెళ్లడమే తన గోల్ అని సంజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఓటీటీలోకి అఖిల్ బ్లాక్బస్టర్ 'లెనిన్'..
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్' థియేటర్లలో సాలిడ్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారు త్వరలోనే ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.

Protection ఇస్తానని... Pocket ఖాళీ చేశాడా?
“ఫ్యూచర్ చెబుతానని... చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్యూచర్నే మార్చేశాడా?” 😳💸 కెనడాలో గంగాధర్ బాబు అనే 29 ఏళ్ల వ్యక్తి సైకిక్, స్పిరిచువల్ హీలర్గా చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుంచి $800,000కు పైగా తీసుకున్నట్లు టొరంటో పోలీసులు చెబుతున్నారు. మీకు, మీ ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం జరుగుతుందని భయపెట్టి, స్పిరిచువల్ ప్రొటెక్షన్ పేరుతో పదే పదే డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై కెనడా-వైడ్ వారెంట్ జారీ కాగా, అతడు భారత్కు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు
మహారాష్ట్రలో GSM ఫాయిల్స్ కంపెనీ MD మోహన్సింగ్ను చంపడానికి ఆయన బిజినెస్ పార్ట్నర్ 'సాగర్' ప్లాన్ చేశాడు. సాగర్ షేర్ మార్కెట్లో నష్టపోయి మోహన్సింగ్ దగ్గర 32 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టి, కంపెనీ మొత్తాన్ని లాక్కోవడానికే ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ మోహన్సింగ్ భుజానికి తగిలినా అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో ఉన్నాడు. CCTV కెమెరాల ఆధారంగా పోలీసులు సాగర్ను అతనికి సాయం చేసిన వాళ్లందరినీ అరెస్టు చేశారు.

శాండ్విచ్ను గన్ షేప్లో కొరికాడని సస్పెండ్!
శాండ్విచ్ను తుపాకీ ఆకారంలో కొరికి క్లాస్మేట్ వైపు చూపించాడనే రీజన్తో USలో ఓ 6 ఏళ్ల బాలుడిని స్కూల్ సస్పెండ్ చేసింది. జార్జియాలోని స్కూల్లో ఫస్ట్ గ్రేడ్ చదువుతున్న జాన్ మెడినా అనే చైల్డ్పై తీసుకున్న ఈ డిసిప్లినరీ యాక్షన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఆటిజమ్తో బాధపడుతున్న తమ బాబుపై స్కూల్ మేనేజ్మెంట్ తరచూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, 2023 నుంచి ఇప్పటివరకు 14 సార్లు సస్పెండ్ చేశారని బాలుడి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాతోనే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం: కేటీఆర్
సోషల్ మీడియా శక్తి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాకు హద్దు, పరిమితి ఉంటే బాగుంటుంది, కానీ ఆ హద్దులను ఎవరు నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. వార్తలలో పాజిటివ్, నెగెటివ్లు రాస్తూ, అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఆపకండి అని కోరే మీడియా కంటే, ప్రభుత్వాల జవాబుదారీతనానికి, ప్రజలకు స్వేచ్ఛగా సమాచారం అందించడానికి సోషల్ మీడియానే మెయిన్ ప్లాట్ఫామ్గా మారిపోయిందని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినం: ప్రధాని మోదీ
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. తరువాత జరిగిన బహిరంగ సభలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినమని అన్నారు. రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. అయన తన ప్రసంగాన్ని "అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో మొదలుపెట్టారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపైకి వచ్చే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి బంగారం దోచేశారు
TG: హైదరాబాద్లోని చందానగర్ బాలాజీ జ్యువెలరీ షాప్లో నిన్న అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు, తలుపుకు రంధ్రం చేసి సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తుండగా, CCTV ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

మహిళను వేధించిన SIకి షాక్
TG: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వేధింపులకు పాల్పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట SI కదిరే శ్రీకాంత్ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు 4నెలలుగా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సిమ్కార్డులు ధ్వంసం చేసి వైఫై ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, 14రోజుల రిమాండ్ విధించింది.

స్కూల్ డాబాపై యువకుడి దారుణ హత్య
AP: నెల్లూరు జిల్లా గూడూరు పక్కన ఉన్న విందూరులో ప్రైమరీ స్కూల్ డాబా మీద షాహుల్(21) అనే కుర్రాడు రక్తమడుగులో చనిపోయి వున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి. రక్తం ఎక్కువగా పోవడం వల్లే అతడు చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్న ఆధారాలు చూస్తుంటే ఎవరో గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

'కొరియన్ కనకరాజు' ట్రైలర్ : ఫన్ అండ్ హారర్ హంగామా!
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేశారు. థ్రిల్, హాస్యం, హారర్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ రితికా నాయక్, కామెడీ నటుడు సత్య తమ పాత్రలతో అలరించానున్నారు . తమన్ అందించిన మ్యూజిక్ హారర్, ఫన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

OUలో 'జెన్ జీ పోరుబాట' ప్రారంభం
TG: ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో జెన్ జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో "జెన్ జీ పోరుబాట" పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. సంఘం ఫౌండర్, ప్రెసిడెంట్ శివాజీ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, BPL ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ISROలో 410 అప్రెంటిస్ జాబ్స్
ISROలో జాబ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బెంగళూరులోని U.R రావు శాటిలైట్ సెంటర్లో 410 అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్స్కు 220, టెక్నీషియన్స్కు 120, కమర్షియల్ అప్రెంటిస్కు 70 పోస్టులున్నాయి. డిగ్రీ, డిప్లొమా, కామర్స్ అర్హత కలిగిన కాండిడేట్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది. కాండిడేట్లు NATS వెబ్సైట్లో ఆగస్ట్ 28 వరకు ఆన్లైన్లో <a href="https://nats.education.gov.in/">అప్లై </a>చేసుకోవచ్చు.