Latest

తలకిందులో ఇల్లు
బిహార్లోని ముజఫర్పుర్లో ఉన్న ఒక ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా తలకిందులుగా ఉండటమే దీని ప్రత్యేకత. అక్కడ ఉన్న బసంత్ ప్యాలెస్ హోటల్ దగ్గర ఈ వింతైన భవనాన్ని కట్టారు. సందర్శకులను పెంచుకునేందుకు హోటల్ యజమాని దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. విదేశాల్లో ఉండే ఇలాంటి భవనం తమ ఊళ్లోనే ఉండటంతో జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సరదాగా ఫోటోలు, వీడియోలు తీస్తూ రీల్స్ చేస్తున్నారు.

వాట్సాప్ అకౌంట్ భద్రతకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సైబర్ మోసాల నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్ను భద్రంగా ఉంచేందుకు టూ-స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా ప్రారంభించాలి. తెలియని లింకులు, OTPలు, వెరిఫికేషన్ కోడ్లను ఎవరికీ పంచుకోకూడదు. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వామ్మో దయ్యం పక్షి
ప్రకృతి సృష్టిలో వింత జీవుల్లో ‘పొటూ’ పక్షి ఒకటి. దీన్నే ఘోస్ట్ బర్డ్ అంటే ‘దయ్యం పక్షి’ అని పిలుస్తారు. పెద్ద పసుపు రంగు కళ్ళు, విచిత్రమైన ఆకారంతో ఉండే ఈ పక్షి రాత్రివేళల్లో చేసే ఏడుపులాంటి అరుపులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కనీసం గూడు కూడా కట్టుకోదు. రక్షణ కోసం చెట్టు కొమ్మపై వాలి, కళ్ళు మూసుకుని ఎండిపోయిన కర్ర ముక్కలా మారిపోతుంది. ఎంత వెతికినా కంటికి దొరకనంతగా చెట్టులో లీనమైపోయే ఈ పక్షి ఎక్కువగా సెంట్రల్, సౌత్ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది.
భార్య హత్య.. భర్తపై ఆరోపణలు
AP: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కొత్తపల్లిలో పద్మావతి అనే మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె భర్త సురేష్పై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. 'తల్లికి వందనం' పథకం కింద వచ్చిన డబ్బు విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని మృతురాలి తల్లి కళావతి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2 ఇయర్స్ అయినా మారలేదు! వైరల్ వీడియో!
ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో 2024 జూన్ 24న పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు విపక్షాలు "NEET.. Shame Shame" అని గట్టిగా నిరసన తెలిపాయి. కానీ రెండేళ్లు గడిచినా, ఈ రోజు (24 జులై 2026) వరకు ఆయన పేపర్ లీక్స్ని అసలు ఆపలేకపోయారు. ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయన రాజీనామా చేయాలని ఇప్పుడు దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది.

రేషన్ కార్డు e-KYCకి ఈనెల 31 లాస్ట్ డేట్!
TG : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ చేసుకోవడానికి ఈనెల 31ని ప్రభుత్వం లాస్ట్ డేట్గా నిర్ణయించింది. వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కేవైసీ అవ్వక, ఒక్కో మండలంలో ఇంకా 1,000 నుంచి 2,000 వరకు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ కాలేదు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రేషన్ కార్డులను తొలగించే కుట్ర చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
847 పుష్అప్స్తో గిన్నిస్ రికార్డు
హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్తాష్ చౌదరీ నడుముపై 27 కిలోల బరువు పెట్టుకుని గంటలో 847 పుష్అప్స్ తీసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు మంచానికే పరిమితమైన పట్టుదలతో కోలుకుని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి 'పుష్అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సిరియా వ్యక్తి రికార్డును దాటి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి ప్రతిభకు గిన్నిస్ సంస్థ ప్రత్యేక సర్టిఫికెట్ అందించింది.

ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి: రేవంత్ రెడ్డి
TG: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఊరికి దూరంగా కాకుండా అన్ని సదుపాయాలు ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ORR లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

వృద్ధాప్యానికి చెక్ పెట్టాలన్న బిలియనీర్
అమెరికన్ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తాను ల్యాబ్లో తన సొంత 'బేబీ క్లోన్'ను సృష్టించినట్లు ప్రకటించారు. తన శరీర కణాలను పిండ దశకు మార్చి, భవిష్యత్తులో కొత్త అవయవాల తయారీ, ఔషధాల పరీక్షలు, యవ్వన కణాల చికిత్స కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మానవ క్లోనింగ్ విజయవంతమైందని శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో బ్రయాన్ చేసిన ఈ ప్రకటనపై శాస్త్రవేత్తలు, నెటిజన్లలో తీవ్ర చర్చ సాగుతోంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపే నిర్ణయం!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్పై ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, దీనిపై రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం అడిగిందని CJP స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా తెలిపారు. విద్యాశాఖ మంత్రిని త్వరలోనే తొలగిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే నీట్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదైన FIRలు, కేసులను ఉపసంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద పోలీస్ రాజీనామా!
స్టూడెంట్స్ ప్రొటెస్ట్కు మద్దతుగా ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ స్టేజ్ పై యూనిఫామ్లోనే ప్రసంగిస్తూ, ఎగ్జామ్ పేపర్ లీకేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడటం తిరుగుబాటు అయితే, తాను తిరుగుబాటుదారుడినేనని ప్రకటిస్తూ.. తన రాజీనామా లేఖను CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు నేరుగా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్ట్రెస్ కంట్రోల్కు కొత్త మార్గం ‘ఫ్రిజ్ సిగరెట్’
ఒత్తిడి తగ్గించుకోవడానికి నేటితరం GEN-Z కొత్త అలవాటును ఎంచుకుంటోంది. సిగరెట్కు బదులుగా చల్లటి కూల్డ్రింక్స్ తాగి రిలీఫ్ పొందే ఈ పద్ధతిని 'ఫ్రిజ్ సిగరెట్' అంటున్నారు. మానసిక అలసట నుంచి బయటపడేందుకు మెదడు ఎంచుకునే మార్గం ఇదని నిపుణులు చెప్తున్నారు. అయితే తరచూ తాగుతుంటే శరీరంలో షుగర్, కెమికల్స్ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి బదులుగా కొబ్బరినీళ్లు, హెర్బల్ టీ తాగడం లేదా కొద్దిసేపు నడవడం, స్నేహితులతో మాట్లాడటం ఇంకా మంచి మార్గాలు.

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో చంద్రబాబు
AP: పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూల్లో ఈరోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, టీచర్లతో మాట్లాడారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా పరిశీలించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
అనవసరంగా GenZ తరంతో పెట్టుకున్నావు మోడీ- KTR
విద్యా విధానంలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ చేసిన దీక్షను ED, CBI భయాలతో ప్రధాన మీడియా కవర్ చేయలేదని BRS లీడర్ KTR ఆరోపించారు. అయితే, యువత సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరాన్ని దేశవ్యాప్తంగా వినిపించిందని ఆయన ప్రశంసించారు. నేపాల్, శ్రీలంకల్లో యువత తిరుగుబాటుతో ప్రభుత్వాలే పడిపోయిన చరిత్రను గుర్తుచేస్తూ, Gen Z తరంతో పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించాడు

23 మంది విద్యార్థినులకు అస్వస్థత
TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో 23 మంది ఇంటర్, 10వ తరగతి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి బగారా రైస్, ఆలు కూర, సొరకాయ కూర తిన్న తర్వాత 15 మంది కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. వార్డెన్ వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 11 మంది కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఉదయం మరో 8 మందికి విరోచనాలు, వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నరేందర్ రాఠోడ్ (DMHO) తెలిపారు.

సన్స్క్రీన్ స్ప్రే వాడుతున్నారా?
ప్రస్తుతం చర్మాన్ని ట్యాన్, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుకునేందుకు సన్స్క్రీన్ స్ప్రేలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రీమ్లతో పోలిస్తే ఇవి పల్చగా ఉంటాయి. అయితే స్ప్రే చేసుకుంటే సరిపోదని, చర్మంపై తేలికపాటి పొరలా మెరిసేంత వరకు స్ప్రే చేసి మర్దనా చేయాలని నిపుణులు అంటున్నారు. ముఖంపై నేరుగా స్ప్రే చేయకుండా అరచేతిలో వేసుకుని రాసుకోవడం వల్ల కళ్లు, ముక్కులోకి వెళ్లకుండా ఉంటుందంటున్నారు.

బలప్రయోగం చేసిన పోలీసులను గుర్తించేందుకు వెబ్ సైట్: సీజేపీ
'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా బలప్రయోగానికి పాల్పడిన పోలీసు సిబ్బందిని గుర్తించేందుకు వెబ్ సైట్ను ప్రారంభించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. తమ ఉద్యమానికి విదేశీ నిధులు అందుతున్నాయన్న ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం సోనమ్ వాంగ్చుక్తోపాటు తమతో ఎందుకు చర్చలు జరుపుతోందని ప్రశ్నించారు.

కరెంట్ కోతలపై హరీష్రావు ఫైర్
TG: యాదాద్రిభువనగిరి జిల్లా సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్రావు, రైతులకు కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి 10–12 గంటలకే పరిమితమవుతోందని ఆరోపించారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ అందించాలంటే ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రొటెస్టర్స్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఇదే!
జులై 20న ప్రొటెస్టర్స్ పై జరిగిన దాడిని అస్సలు ఊరుకునేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పోక్స్ పర్సన్ హెచ్చరించారు. ప్రొటెస్టర్స్ పై ఎటాక్ చేసి, మహిళలను వేధించిన ప్రతి పోలీస్ ఆఫీసర్ని బాధ్యులను చేస్తూ ఐడెంటిఫై చేస్తామన్నారు. దీనికోసం త్వరలోనే ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నామని, అందులో దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయవచ్చని చెప్పారు. లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆఫీసర్లపై FIR ఫైల్ చేస్తామని, అవసరమైతే కోర్టుకి వెళ్లైనా సరే బాధ్యులను జైలుకి పంపుతామని క్లియర్గా చెప్పారు.
జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్.. నెక్స్ట్ ఏంటి?
ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్గా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. యువత హక్కుల కోసం 26 రోజులకు పైగా హంగర్ స్ట్రైక్ చేసిన సోనమ్ సర్ ఫైనల్గా దీక్ష విరమించడం పట్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రెజెంట్ ఈ ప్రొటెస్ట్ నెక్స్ట్ లెవల్కి రీచ్ అయ్యిందని, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు జంతర్ మంతర్ దగ్గర తమ పోరాటం అసలు ఆపేదే లేదని అభిజిత్ స్పష్టం చేశారు.

జనగాం జిల్లాలో ఘోర ప్రమాదం
TG: జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతి స్పాట్లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.