ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో సుక్క రాంనర్సయ్య!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా తెలంగాణ నుండి సామాజిక కార్యకర్త, సింగర్ సుక్క రాంనర్సయ్య అక్కడికి వెళ్లారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన NEET పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అక్రమంగా తరలించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల యువత, రాజకీయ నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.


