సీజేపీ నిరసన.. AAP లీడర్ రాయ్ పిలుపు
దిల్లీలో సీజేపీ ర్యాలీ ముందు AAP లీడర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాయన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు అంధకారంలో పడుతోందని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ను ప్రభుత్వం బలవంతంగా నిలిపేసిందని ఆరోపించారు.


