చిన్న వినాయకులకు చిన్న పాండ్స్,.!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో చిన్న వినాయకుల నిమజ్జనం కోసం తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం, హౌసింగ్ బోర్డు, బీసీ హాస్టల్ వెనుక కల్వకుర్తి రోడ్ పార్కులో ఈ పాండ్స్ ఉన్నాయి. కమిషనర్ గిరీష్ వీటిని ప్రారంభించారు. టీపీఓ లక్ష్మీపతి, మేనేజర్ లక్ష్మన్న, ఏఈ గాయత్రి, ఆర్ఓ సలాం, ఆర్ఐ నాగేష్ పాల్గొన్నారు. భక్తులు తమ చిన్న విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేయవచ్చు.


