CM రేవంత్ సొంతగడ్డపై కవిత సభ
TG: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు ర్యాలీ చేపట్టనున్నారు. సామాజిక న్యాయం, ఉచిత విద్య, వైద్యం, యువత, రైతుల సమస్యలపై కవిత మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.



