మళ్లీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తా- అభిజీత్ దీప్కే
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 37 రోజులు ప్రొటెస్ట్ చేసిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫైనల్గా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇన్నాళ్లకు ప్రశాంతంగా నిద్రపోతున్నానని, నార్మల్ లైఫ్లోకి వెళ్తానని చెప్పారు. ఎగ్జామ్ రూల్స్ ఎన్ని మారినా మనుషుల ఆలోచనలు మారకపోతే వేస్ట్ అని, పేపర్ లీక్స్ కేసు ఫస్ట్ కోర్టు విచారణే వాయిదా పడటంపై ఆయన ఫైర్ అయ్యారు. స్టూడెంట్స్పై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయకపోతే, నెక్స్ట్ టైమ్ ఇంకా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.


