వినుకొండలో ప్రజా దర్బార్

AP : పల్నాడు జిల్లా వినుకొండలోని Chief Whip కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఇందులో Chief Whip జీవీ.ఆంజనేయులు పాల్గొని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, నీళ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై చాలా మంది ఆయనకు చెప్పుకున్నారు. ప్రజల ఇబ్బందులు విన్న చీఫ్ విప్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.



