రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలుగురు ఎస్ఐల బాధ్యతల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగాళ్లపల్లి ఎస్ఐ అశోక్, ఇల్లంతకుంట ఎస్ఐ ఉపేంద్ర చారి, వేములవాడ రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, కొనరావుపేట ఎస్ఐ రామ్మోహన్ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.



