← Back to news

పిచ్చికుక్కల భయం.. 15 మందికి తీవ్ర గాయాలు!

By Krishna Kittu· 21 Aug 2026· Kaligiri
పిచ్చికుక్కల భయం.. 15 మందికి తీవ్ర గాయాలు!

AP : నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో పిచ్చికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. 15 మందిపై దాడి చేసి కాళ్లు, చేతులు, చెవులను తీవ్రంగా గాయపరిచాయి. బాధితులు ప్రస్తుతం వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధికుక్కల సంఖ్య బాగా పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local