విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ ఏది? తనిఖీలు చేపట్టరా? - AIPSU

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని, ఇట్లయితే విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని AIPSU నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల్లో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, పనిచేసే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవన్నారు. DEO, అగ్నిమాపక అధికారులు వెంటనే సంయుక్త తనిఖీలు చేపట్టి, NOC లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తక్షణమే స్పందించకున్నా, పట్టించుకోకపోయినా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.



