కావాలంటే మీరూ ఎలక్షన్స్లో నిల్చోండి: కంగనా రనౌత్
కావాలంటే మీరూ ఎలక్షన్స్లో నిల్చొని గెలవండి. అంతేకానీ, ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పొద్దు అంటూ ఎంపీ, నటి కంగనా రనౌత్ అన్నారు. దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాము తప్పకుండా సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేయాలని అనుకుంటున్నాయని, దాన్ని తిప్పికొడతామని చెప్పారు.


