స్కైరూట్ ఏరోస్పేస్..ఇది చాలా ప్రత్యేకం

2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా స్థాపించిన సంస్థే ఈ స్కైరూట్ ఏరోస్పేస్. ప్రపంచంలోని మినీ-సాటిలైట్ మార్కెట్ కోసం వాణిజ్యపరంగా ప్రయోగ వాహనాలను డెవలప్ చేయడానికి దీన్ని మొదలుపెట్టారు. మొదట్లో ఈ సంస్థ ప్రయోగ వాహనాల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ప్రయోగ ఖర్చు, ఉత్పత్తి సమయం తగ్గించే లక్ష్యంతో పనిచేసింది. ప్రస్తుతం నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 సాటిలైట్ ఈ సంస్థ తయారు చేసిందే.


