పవన్ కల్యాణ్ను పరామర్శించిన రఘురామకృష్ణ రాజు

AP: కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పరామర్శించారు. వారితోపాటు శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ కూడా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు పవన్ కల్యాణ్ను పరామర్శించారు.


