షెఫాలీ వర్మ విధ్వంసం.. 49 బంతుల్లో సెంచరీ

ఆసియా క్రీడల సెమీస్లో ఓపెనర్ షెఫాలీ వర్మ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించింది. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన ఈ డైనమైట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 49 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర సెంచరీ బాదింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్.. షెఫాలీ వీరవిహారంతో 20 ఓవర్లలో 195/4 స్కోర్ చేసింది. దీంతో ఫైనల్ చేరాలంటే బంగ్లా 196 రన్స్ చేయాల్సి ఉంది.



