సర్వం..లీకులమయం

2014 నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం, రాజస్థాన్లో రీట్ పరీక్ష, బీహార్లో BPSC పరీక్షలు, తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలు జరిగాయి. 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో కూడా ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తరువాత పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎక్సమినేషన్స్ చట్టం, 2024ను అమల్లోకి తీసుకొచ్చింది.


