← Back to news

రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఉపాధ్యాయుల ర్యాలీ

By teju tv A· 21 Aug 2026· కొండమల్లేపల్లి
రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఉపాధ్యాయుల ర్యాలీ

TG : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ కల్వకుర్తిలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఆమె ఫోటోకి నివాళులర్పించారు. ఉపాధ్యాయులపై దాడులు ఆగాలంటే టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, మత్తు పదార్థాలను అరికట్టాలని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో JAC నాయకుడు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More in Local