మేకలపై దూసుకెళ్లిన ఎక్స్ప్రెస్ రైలు
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ హతిగ్వాన్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కృష్ణ రామ్ కా పుర్వా రైల్వే క్రాసింగ్ దగ్గర్లో నిన్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో సుమారు 30 నుంచి 35 మేకలు మృతి చెందాయి. రైలు వేగంగా రావడాన్ని గమనించిన అక్కడి మహిళలు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న CRPF సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


