ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్చుక్ భార్య

ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వాంగ్చుక్ను అక్రమంగా నిర్బంధించారని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్లో కోరారు. వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల నిరాహార దీక్ష అనంతరం పోలీసులు ఆయనను శనివారం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆమె ఆరోపించారు.


