బీజేపీలో 100 మంది ఎంపీలపై కేసులున్నాయి: సౌరవ్ దాస్

ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడిన యువతి రుచికా సింగ్పై క్రిమినల్ కేసు పెట్టడం కరెక్ట్ కాదని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. అసభ్య పదాలు వాడినంత మాత్రాన క్రిమినల్ కేసు పెట్టడం సరికాదన్నారు. లోక్సభలో 50 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, బీజేపీలో 100 మంది ఎంపీలపై కేసులు ఉన్నాయని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పోలీసులు వారిపై దృష్టి పెట్టాలన్నారు.



