యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు: రాహుల్ గాంధీ

పబ్లిక్ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. యువత సెంటిమెంట్స్ను అన్ని పార్టీలూ గౌరవించాలని అన్నారు. విద్యార్థుల ఆశల్ని, ఆశయాలను అందరం అర్థం చేసుకోవాలన్నారు. వారి ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వారికి భారీ స్థాయిలో మద్దతు పలికారని వివరించారు. యువతను తక్కువ అంచనా వేసిన వారికి విద్యార్థులు వారి పోరాటంతో సరైన పాఠం చెప్పారని అన్నారు.


