Latest

మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!
Local· 4d ago

మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 68 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 గ్రాముల నాగాభరణం, రెండు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నాయి. క్రైం నంబర్ 448/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.

వైఎస్ సేవలకు.. నందిపేట నివాళి!
Local· 4d ago

వైఎస్ సేవలకు.. నందిపేట నివాళి!

నిజామాబాద్ జిల్లా నందిపేటలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్ వైెఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ’’ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇవన్నీ పేదల కోసమే! లక్షలాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేతను మర్చిపోవడం సాధ్యమా? వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’’ని అన్నారు.

రాహుల్ కేసుపై మణుగూరులో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన!
Local· 4d ago

రాహుల్ కేసుపై మణుగూరులో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హెడ్‌క్వార్టర్స్‌లో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వేదికను బీజేపీ మతోన్మాదులు గంగాజలంతో "శుద్ధీకరణ" చేశారు. రాహుల్ గాంధీ దాన్ని దళితుల అవమానంగా ఖండించారు. ఆందోళనగా ఆయనపై రివర్స్ కేసు పెట్టడం జరిగింది! దీన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేసింది. "రాహుల్ పై కేసులు రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.

కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!
Local· 4d ago

కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!

నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కీలక లేఖ రాశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన “శుద్ధీకరణ” ఘటనపై స్పందించారు. ఆ ఘటనపై రాజ్యాంగపరమైన జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!
Local· 4d ago

సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ మోసాలపై ప్రత్యేక సెషన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ విరాళాలు, నకిలీ లింకులు, ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని చెప్పారు.

నందన్ గ్రామసభలో 313 పనుల ప్లాన్ రివీల్!
Local· 4d ago

నందన్ గ్రామసభలో 313 పనుల ప్లాన్ రివీల్!

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామంలో భారీ గ్రామసభ జరిగింది. సర్పంచ్ కున హేమలత మహేష్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, టీఏ రవీందర్, ఎఫ్ఏ భూమేష్ పాల్గొన్నారు. "వీబీజీ రామ్జీ" పథకంలో భాగంగా రాబోయే మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరించారు. మొత్తం 313 పనుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. మీ గ్రామంలో కూడా ఇలాంటి గ్రామసభలు జరుగుతున్నాయా? వాటిని వార్తలుగా పంపండి. ఫొటో కూడా జత చేయండి.

జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?
National· 4d ago

జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?

పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పెట్టిన ఆహారమే.. వాటికి ప్రాణాంతక ఉచ్చుగా మారుతోంది. ‘బైట్ బాంబ్స్‌’గా పిలిచే ఈ ఉచ్చుల్లో పేలుడు పదార్థాన్ని ఆహారం లేదా పండులో దాచిపెడతారు. జంతువు దాన్ని సాధారణ ఆహారమని భావించి కొరికిన వెంటనే నోట్లో పేలుడు జరిగి దవడ, నాలుక తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో తినలేక ఆకలితో లేదా ఇన్ఫెక్షన్‌తో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అడవి పందులను లక్ష్యంగా పెట్టిన ఈ ఉచ్చులకు ఏనుగులు, ఎద్దులు వంటి ఇతర జంతువులు కూడా బలవుతున్నాయి. ఒడిశాలో ఇటీవల ఇలాంటి ఉచ్చు ఓ ఎద్దు మృతికి కారణమైంది.

జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!
Local· 4d ago

జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!

భద్రాద్రి కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కఠిన శిక్ష పడింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడిపారు. వారిపై కేసులు నమోదు చేశారు. 2వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి రవికుమార్ విచారణ చేశారు. నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ’’మద్యం తాగి డ్రైవ్ చేస్తే ప్రాణాపాయ ప్రమాదాలు తప్పవు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదు. తనిఖీలు మరింత విస్తృతం చేస్తామ’’న్నారు.

నల్లబెల్లిలో పోచమ్మ బోనాల సందడి!
Local· 4d ago

నల్లబెల్లిలో పోచమ్మ బోనాల సందడి!

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాలు సిద్ధం చేసి, ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. బోనాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!
Local· 4d ago

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజుకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ’’పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఆయనే తీసుకొచ్చారు. నాయకులు వస్తారు.. పోతారు.. కానీ వైఎస్ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం!’’ అని ఆయన అన్నారు.

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!
Local· 4d ago

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ బాలిక ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చింతపల్లి గ్రామానికి చెందినది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది? ఇది మానసిక ఒత్తిడా.. లేక వేరే కారణమా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!
Local· 4d ago

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఎల్నినో కారణంగా వాతావరణ మార్పులపై నిమ్మ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మకు ఆశించే ఎర్రనల్లి, ఎండితెగులు, బంకతెగుల నివారణ చర్యలు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్, తెనాలి అధికారి యు.శ్రీనిత్య హాజరయ్యారు. ‘‘వ్యాధులు అంతుచిక్కకపోతే పంటే పూర్తిగా దెబ్బతింటుంది కదా! రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవగాహన సదస్సులకు హాజరు కావాల’’ని వారు చెప్పారు.

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు
Local· 4d ago

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు

భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 420 మీటర్ల బ్యానర్, మానవహారంతో ఆందోళన వ్యక్తం చేశారు. రూ.49 వేల కోట్ల రుణమాఫీకి బదులు రూ.18 వేల కోట్లే చేశారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను దగా చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుట్రపన్నుతున్నాయని ఎద్దేవా చేశారు.

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!
Local· 4d ago

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!

రంగారెడ్డి జిల్లాలో భూముల సర్వే పనులు ముమ్మరం. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తహసిల్దార్లకు క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 611 గ్రామాలకు గాను 108 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. భూభారతి, 22ఏ విషయాల్లో బ్రోకర్లను నమ్మొద్దని రైతులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సరిత పాల్గొన్నారు.

136B డాలర్లు.. రూపాయికి అండగా ఎలా?
National· 4d ago

136B డాలర్లు.. రూపాయికి అండగా ఎలా?

విదేశీ కరెన్సీ భారీగా రావడంతో రూపాయికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. ఆగస్టు 31 నాటికి RBI ప్రత్యేక స్వాప్‌ సదుపాయం ద్వారా 136.38 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులు వచ్చాయి. ఇందులో 127.23 బిలియన్‌ డాలర్లు NRIల డిపాజిట్ల నుంచే వచ్చాయి. బ్యాంకులు ఈ డాలర్లను RBIతో స్వాప్‌ చేసుకోవడంతో కేంద్ర బ్యాంకు చేతిలో విదేశీ కరెన్సీ పెరుగుతుంది. అవసరమైనప్పుడు RBI మార్కెట్‌లో డాలర్లు అమ్మి రూపాయిపై ఒత్తిడిని తగ్గించగలదు. అంటే ఈ నిధులు రూపాయిని ఒక్కసారిగా బలపరచవు.. కానీ అది మరింత పడిపోకుండా RBIకి బలమైన అండగా నిలుస్తాయి.

HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!
Local· 4d ago

HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!

హైదరాబాద్‌లోని బేగంపేట HPS సొసైటీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైందని ఆరోపణ! హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాంటెంప్ట్ నోటీసు జారీ అయింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది.. కానీ ఆ ఆదేశాన్ని పాటించలేదు. అందుకే, తాజాగా సిజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది.

Uberలో భారీ లేఆఫ్స్.. 3,300 మందిపై ఎఫెక్ట్
International· 4d ago

Uberలో భారీ లేఆఫ్స్.. 3,300 మందిపై ఎఫెక్ట్

ప్రముఖ రైడ్ హైలింగ్ సంస్థ ఉబర్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వరల్డ్‌వైడ్‌గా దాదాపు 3,300 మంది ఎంప్లాయీస్‌ను తొలగించనుంది. ఇది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆల్‌మోస్ట్ 10 శాతం. మేనేజ్‌మెంట్ లెవల్స్‌ను తగ్గించి, ఆర్గనైజేషన్‌ను మరింత సింపుల్‌గా, ఫాస్ట్‌గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మేనేజర్ల సంఖ్యను కూడా 20% తగ్గించనుంది. అయితే అందరూ ఉద్యోగాలు కోల్పోరు.. కొందరిని ఇతర రోల్స్‌లోకి షిఫ్ట్ చేయనున్నారు. 2020 కోవిడ్ తర్వాత ఉబర్‌లో ఇదే అతిపెద్ద లేఆఫ్.

గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!
Local· 4d ago

గొల్లప్రోలు ఎన్నికలకు రెడీ.. 23 వార్డుల పరిశీలన!

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 20 నుంచి 23కు పెరుగుతున్నాయ్. గెజిట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్కంలో కమిషనర్ దివిజ సంపతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్త కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బీవీఎస్ ప్రసాద్, కార్యాలయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!
Local· 4d ago

హిందూపురంలో జనసేన భారీ బైక్ ర్యాలీ!

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి చౌడేశ్వరీ కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ జెండాలతో నిండిపోయాయి. ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్ఈడీ తెరపై పవన్ ప్రసంగాన్ని శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు.

బుగ్గారంలో మండల క్రీడలు.. సెప్టెంబర్ 9 నుంచి!
Local· 4d ago

బుగ్గారంలో మండల క్రీడలు.. సెప్టెంబర్ 9 నుంచి!

జగిత్యాల జిల్లా బుగ్గారంలో క్రీడల సందడి మొదలవ్తోంది. MEO మోహన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈనెల 9న బుగ్గారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో SGF క్రీడలు స్టార్ట్! మొదటి రోజు అండర్-14, 17 బాయ్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలు. 10న అండర్-14, 17 గర్ల్స్ కబడ్డీ, కోకో, వాలీబాల్. 11న అండర్-14, 17 బాయ్స్, గర్ల్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరుగుతాయి. బుధవారం పీఈటీలు, పీడీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వణుకు వస్తే.. శరీరంలో ఏం జరుగుతుంది?
Education· 4d ago

వణుకు వస్తే.. శరీరంలో ఏం జరుగుతుంది?

చలిలో బయటికి వెళ్లగానే మన శరీరం వణకడం మొదలవుతుంది కదా.. అసలు ఎందుకు వణుకుతామో తెలుసా? శరీరం తన వేడిని కాపాడుకునే సహజ మార్గం ఇది! చలి పెరిగినప్పుడు మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ శరీరం చల్లబడుతోందని గుర్తిస్తుంది. వెంటనే కండరాలు చాలా వేగంగా కుదించుకుని వదులుకోవడం మొదలుపెడతాయి. ఈ చిన్న చిన్న కండరాల కదలికల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే మనకు వణుకు వస్తుంది. అంటే వణకడం బలహీనత కాదు.. శరీరం తన ఉష్ణోగ్రతను నిలబెట్టుకునేందుకు చేస్తున్న సహజ ప్రయత్నం అన్నమాట! ఇలా శరీరం వేడిని తిరిగి పొందుతుంది.