Crime

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!
Crime· 17 Jun 2026

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ తన ఐదేళ్ల కూతురు ఆర్యతో కలిసి కారులోంచి సామాన్లు తీస్తుండగా. ఒక కారు వేగంగా వచ్చి వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఆర్య స్వల్ప గాయాలతో బయటపడగా, క్రితికాకు తీవ్ర గాయాలవ్వడంతో ఐసీయూ (ICU)లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ భయానక దృశ్యాలు సిసిటివి (CCTV)లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా
Crime· 16 Jun 2026

కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా

AP: తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు విలేజ్‌కు చెందిన రవిచంద్రారెడ్డికి రూపాయికి మూడు రూపాయలు ఇస్తామంటూ ఓ ముఠా సభ్యులు నమ్మించారు. నగదుతో వెళ్తున్న రవి చంద్రారెడ్డిని ముఠా సభ్యులు ఏర్పేడు మేర్లపాక వద్ద కారులో ఎక్కించుకుని రూ.14 లక్షల నగదును లాక్కొని, ఆర్ మల్లవరం వద్ద కారు నుంచి తోసేసి పరారయ్యారు. రవిచంద్రారెడ్డి ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏర్పేడు పోలీసులు చిల్లకూరుకు చెందిన శ్రీనివాసులను, జీవకోనకు చెందిన గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ACB సోదాలు
Crime· 16 Jun 2026

సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ACB సోదాలు

TG: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ACB అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. HYDలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ACB బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 10 ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

బోడుప్పల్‌‌లో చైన్ స్నాచింగ్
Crime· 16 Jun 2026

బోడుప్పల్‌‌లో చైన్ స్నాచింగ్

TG: హైదరాబాద్ బోడుప్పల్‌‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు నర్ర అరుణ మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలోని సాకుబు నిలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌‌పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. వృద్ధురాలి మెడకు స్వల్ప గాయమైంది. చోరీకి గురైన బంగారు మంగళసూత్రం సుమారు 4.5 తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.