Local· 1d ago
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని క్యాండిల్ నిరసన
TG: నర్సు అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మంలో నాయకులు డిమాండ్ చేశారు. కొవ్వొత్తులతో క్యాండిల్ నిరసన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వామపక్ష, ఆదివాసీ సంఘాలతో పాటు AIYF, AISF, PDSU, ABVP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.