Latest

విజయ్ సర్కార్ భారీ డీల్.. ఆ పథకానికి డేట్ ఫిక్స్!
తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘థాయ్ మామన్ తంగ మోతిరం’ పథకానికి భారీ ఆర్డర్ ఖరారైంది. ఈ పథకం కింద 4.41 లక్షల గోల్డ్ రింగ్స్ను తయారు చేస్తారు. రూ.755 కోట్ల విలువైన ఈ ఆర్డర్కు జోయాలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్లు దక్కించుకున్నాయి. టెండర్లో ఈ రెండు సంస్థలు తక్కువ రేటుకు కోట్ చేసాయి. దీంతో పనులను 70:30 రేషియోలో కేటాయించారు. మొదటి నాలుగు నెలల్లో 1,28,499 ఉంగరాలు సప్లై చేయనున్నారు. ఈ స్కీమ్ను సెప్టెంబర్ 15, మాజీ CM అన్నాదురై పుట్టినరోజున ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.

ICUలో ఏసీలు బంద్.. రోగులకు నరకయాతన
TG: ప్రాణాలు కాపాడాల్సిన ICUలోనే ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు అనుకూలమైన వాతావరణం ఎంతో అవసరమైనప్పటికీ, ICUలో ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బంధువులు తెలిపారు. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ఐసీయూ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులను కోరారు.

ఉయ్యూరులో డయేరియా కలకలం... పారాహుషార్
ఉయ్యూరు మున్సిపాలిటీ 5,7 వార్డులో డయేరియా ప్రబలింది. ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శుక్ర వారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. డయేరియా వ్యాప్తికి కారణాలు తెలు సుకునేందుకు నీటి నమూనాలను పరీక్షలకు పంపిన ట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రయాణికుల్లా వచ్చారు… డ్రైవర్ను ఎందుకు చంపేశారు?
ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల క్యాబ్ డ్రైవర్కు జైపూర్ ట్రిప్ అంటూ ఆఫ్లైన్ బుకింగ్ వచ్చింది. జూలై 20న సరితా విహార్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్న అతడిని మధ్యలోనే దాడి చేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని రాజస్థాన్లోని అడవుల్లో పడేసి, కారును కూడా తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. డబ్బుల కొరతతో కారును దోచుకోవాలనే ప్లాన్లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివక్ష వద్దు అంటే ఆదివాసి విద్యార్థులను గదిలో వేసి కొట్టారు
మా school లో మమ్మల్ని వేధిస్తున్నారు. వివక్ష చూపెడుతున్నరు. దీనిని ఆపాలే.. అని ఏకలవ్య మోడల్ స్కూలు పిల్లలు అడిగారు. వినలేదు. నిరాహార దీక్ష కు కూసున్నరు. మూడు రోజులైంది. నీరసంగా ఉన్న ఆ పిల్లలను గదిలో వేసి కొట్టారు. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం ముత్తాపురం గ్రామం లో జరిగింది. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు ఒక్కసారిగా స్కూలుకు చేరుకున్నరు. స్కూలు గేటు ఎదురుగా బైఠాయించారు. పోలీసులు వచ్చిండ్రు. పరిస్థితి ఉద్రిక్తమైంది.

భారత స్టార్టప్లకు ఒక్క వారంలో $221M!
భారత స్టార్టప్ మార్కెట్లో ఒక్కసారిగా ఫండింగ్ జోరందుకుంది. ఆగస్టు 21తో ముగిసిన వారంలో 17 డీల్స్ ద్వారా స్టార్టప్లు మొత్తం $221 మిలియన్లు వచ్చింది. ఇందులో సగానికిపైగా ఫండింగ్ ఒక్క Naviకే వచ్చింది. Sachin Bansal నేతృత్వంలోని Naviకి Prosus నుంచి $100 మిలియన్లు వచ్చాయి. మిగతా డీల్స్లో ఫిన్టెక్, AI, హెల్త్టెక్, ఎంటర్ప్రైజ్ టెక్ వంటి రంగాల కంపెనీలు కూడా ఫండింగ్ తెచ్చుకున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ మొత్తం రెండింతలకు పైగా పెరిగింది.

SIR తిప్పలు... నా వయస్సు 35 సార్... 126 ఏళ్లేంటి సార్..
ఈ భూమిపై ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించబడిన (Verified) అత్యధిక కాలం బతికిన మనిషి ఫ్రెంచ్ మహిళ అయిన Jeanne Calment. ఆమె వయస్సు సరిగ్గా 122 yrs 164 days. కానీ మన ఎన్నికల అధికారులు, ఇంటింటికి సర్వే చేసి ప్రింట్ చేసిన జాబితాలో ఈ రికార్డులనే తిరగరాసేశారు. నర్సాపూర్ జి.తిమ్మాపూర్ గ్రామంలో ఓటర్ల జాబితాలో ఓ 35 ఏళ్ల యువకుడి వయస్సు 126 ఏళ్లుగా ముద్రించారు. తాను వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడనుకోవాల్నో, నన్ను అంత పండు ముసలిని చేశారేంట్రా నాయనా అనుకోవాల్నో అర్థం కాక ఆ యువకుడు బ్లాంక్ అయిపోయాడు.

129 బోగీలు, 3 ఇంజిన్లు… ‘ఆవధ్ మహాశక్తి’
భారత రైల్వేలో ఒకేసారి 129 బోగీలు, 3 ఇంజిన్లతో నడిచిన ‘ఆవధ్ మహాశక్తి’ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే మూడు గూడ్స్ ట్రైన్లను కలిపి ఈ భారీ ఫ్రైట్ ట్రైన్ను నడిపింది. గోండా నుంచి సీతాపూర్ మీదుగా మురాదాబాద్ వైపు వెళ్లిన ఈ రైలు సుమారు 160 కి.మీ ప్రయాణించింది. సగటున గంటకు 42 కి.మీ వేగంతో ఈ దూరాన్ని 3 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది. ఒకే ట్రిప్లో ఎక్కువ సరుకును తరలించడం వల్ల సమయం, ఇంధనం, రైల్వే వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

రిజర్వేషన్ హటావో ఆందోళన కారుల డిమాండ్లు ఇవే!
CJP లాగే సోషల్ మీడియాలో పుట్టి జంతర్ మంతర్ ధర్నాతో గ్రౌండుకు చేరిన రిజర్వేషన్ హటావో ఆందోళన (RHA) డిమాండ్లు ఏంటంటే.. (1) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుల ఆధారిత రిజర్వేషన్లు తీసేసి, కేవలం ఆర్థిక ప్రాతిపదికనే కోటా ఇవ్వాలి (2) వన్ ఫ్యామిలీ, వన్ రిజర్వేషన్ (౩) అప్లికేషన్స్ నుంచి కులం కాలమ్ను పూర్తిగా తొలగించాలి (4) UGC కొత్తగా తెచ్చిన Caste Equality రూల్ తీసెయ్యాలి (5) రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ కఠినంగా అమలు చెయ్యాలి. RHA డిమాండ్స్ పై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ సెంటర్: CM రేవంత్రెడ్డి
తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి CM రేవంత్రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లండన్లోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన CM.. తెలంగాణలో విద్యాపరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు సహకరించాలని యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించాలని కోరారు.

రైతుల హక్కులకు పూర్తి రక్షణ: మంత్రి పొంగులేటి
TG: భూముల రీసర్వే తర్వాత అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్బుక్కులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జగిత్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నకిలీ పాస్బుక్కులను గుర్తించి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్బుక్కుల ఆధారంగా అనర్హులు రైతుబంధు ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. భూ రీసర్వే పూర్తయిన తర్వాత నిజమైన రైతుల హక్కులను కాపాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

రిజర్వేషన్ హటావో ఆందోళనపై పోలీసుల సంచలన ప్రకటన
రిజర్వేషన్ హటావో ఆందోళన కారులకు జంతర్ మంతర్లో ధర్నా చేసే పర్మిషన్ లేదని ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి జంతర్ మంతర్లో ప్రొటెస్టుకు దిగిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఉందన్న ప్రచారం తప్పు అన్నారు. శాంతిభద్రతల కోణంలోనే జంతర్ మంతర్ ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదనీ.. అయితే రాంలీలా మైదానంలో మాగ్జిమమ్ 500 మందితో పీస్ ఫుల్ ప్రొటెస్టుకు పర్మిషన్ ఇచ్చాం అన్నారు. ఈ రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని Xలో ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు: ఈశ్వర్ శంకర్
AP: ప్రభుత్వం 8నెలలుగా తమ డిమాండ్లపై స్పందించకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఏపీ జూడా రాష్ట్ర అధ్యక్షుడు యు.ఈశ్వర్ శంకర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ను 20శాతం పెంచాలని, ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసును 65ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, నాన్ క్లినికల్ పోస్టులను అర్హత కలిగిన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమతో చర్చించకుండా 3శాతం స్టైపెండ్ పెంపును ప్రకటించడం సరికాదన్నారు. సానుకూల స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలు
తెలంగాణలో ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని, నీటిని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జంతర్ మంతర్లో మరో మూమెంట్, రాత్రంతా ఉద్రిక్తత.. అరెస్టులు
'రిజర్వేషన్ హఠావో ఆందోళన' (HRA) అనేది CJP లాగే సోషల్ మీడియాలో పుట్టిన మరో మూమెంట్. ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్లు ఆగస్ట్ 21న ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ కులం ఆధారంగా కాకుండా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఉండాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది వచ్చారు. ఈ ప్రొటెస్టుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే భారీ ఎత్తున ఆందోళనకారులు జంతర్ మంతర్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడంతా భారీగా పోలీసు బలగాలను దించి ఎవరూ రాకుండా చూస్తున్నారు.
రాహుల్ గాంధీ ధర్నా చేసినా FIR నమోదుకు 8 గంటలు
ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థి సాహిల్ లోచబ్ శరీరంపై 200 పెల్లెట్స్ ఉన్నాయని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సాహిల్ కు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. FIR నమోదయ్యేదాకా కదిలేది లేదని పట్టుబట్టడంతో పోలీసులు FIR చేశారు. బాధితుడు సాహిల్ స్పందిస్తూ 'నా ఒంట్లో 200 గాయాలున్నా FIR కోసం 8 గంటలు పట్టింది. లోక్సభ ప్రతిపక్ష నేత (LOP) అండగా నిలబడకపోతే పోలీసులు అసలు కేసు నమోదు చేసే వారే కాదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతులకు పరిహారం నేరుగా అందాల్సిందే: ఉత్తమ్
TG: ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతులకు పరిహారం సకాలంలో అందకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. పునరావాసం, అటవీ అనుమతులపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భూసేకరణ కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.5 వేల కోట్లను నిర్వాసితులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు ఖాతాల్లో జమ చేయడం మాత్రమే కాకుండా, వాస్తవంగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలని సూచించారు.

🌧️ బయటకు వెళ్లే ముందు ఇది చూడండి!
ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉండొచ్చని తెలిపింది. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవాళ్లు బయటకు వెళ్లే ముందు స్థానిక వాతావరణ అప్డేట్ చూసుకోవడం మంచిది.

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్లో చెప్పండి. 👇

AI హైప్ ఓకే… రిటర్న్స్ ఎక్కడ?
AI బిజినెస్పై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఇన్వెస్టర్లకు చిన్న డౌట్ మొదలైంది. డేటా సెంటర్లు, చిప్స్, విద్యుత్, మోడల్ ట్రైనింగ్ కోసం బిలియన్ల డాలర్లు పెడుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గ లాభాలు ఎప్పుడు వస్తాయో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. పైగా ఈ పెట్టుబడుల్లో కొంత భాగం అప్పుల ద్వారా వస్తుండటంతో, వడ్డీ రేట్లు కూడా మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా AI కోసం భారీగా అప్పులు తీసుకుంటున్న టెక్ కంపెనీల బాండ్లపై ఇన్వెస్టర్లు ఎక్కువ రాబడి కోరుతున్నారు.

యూరప్లో వరుస హీట్వేవ్స్… అసలు కారణమేంటి?
యూరప్లో ఈ ఏడాది ఎండలు ఒకదాని తర్వాత ఒకటి షాక్ ఇస్తున్నాయి. NASA తాజా విశ్లేషణ ప్రకారం, మే నుంచి ఆగస్టు మధ్య పశ్చిమ యూరప్లో ఇప్పటికే ఐదు హీట్వేవ్స్ వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C దాటగా, వేడి రాత్రిపూట కూడా తగ్గకుండా కొనసాగింది. దీంతో అడవుల్లో మంటలు, కరువు, నీటి కొరత మాత్రమే కాదు… రోడ్లు, రైలు మార్గాలు కూడా ప్రభావితమయ్యాయి. వాతావరణ మార్పులతో పాటు ఎక్కువ కాలం కొనసాగే అధిక పీడన పరిస్థితులు ఈ వేడిని మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.