Latest

భార్యపై భర్త కిరాతకం.. పిల్లలతో పరార్
TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఓబులకేశవపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మోకు మహేందర్ రెడ్డి తన భార్య మాధవిపై దాడిచేసి, ఆమె కాళ్లు, చేతులు విరిచిన అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకుని పరారయ్యాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపేందుకు ప్రయత్నించి, పిల్లలను కూడా హాని చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసింది. మహేందర్రెడ్డి పిల్లలతో కనిపించకపోగా, ఫోన్ స్విఛాఫ్లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
న్యూస్ చదువుతూ నిద్రపోయిన యాంకర్.. నెటిజన్ల రియాక్షన్
అమెరికాకు చెందిన మార్నింగ్ న్యూస్ FOX ఛానెల్లో యాంకర్ లైవ్ జరుగుతుండగా నిద్రలోకి జారిన వీడియో వైరల్ అవుతుంది. <br>సాధారణంగా లైవ్లో ఇలా జరిగితే ట్రోల్స్ వస్తాయి. వీడియో వైరల్ అవ్వగానే ఆమె ఇద్దరు పిల్లల తల్లి కావడం, రోజువారీ తెల్లవారుజామున షిఫ్టులే దీనికి కారణమని నెటిజన్లు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఉరవకొండలో ఉద్రిక్తత.. గుంతకల్లో సెక్షన్ 30 అమలు
AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయ భూముల అంశంపై YSRCP చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మాజీ MP గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు గుంతకల్ సబ్డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు చేశారు. ఇదే అంశంపై TDP కూడా పోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇకపై ఆ రోల్స్ చేయను: విజయ్ సేతుపతి
ఇకపై తను గెస్ట్ రోల్స్ చేయనని హీరో విజయ్ సేతుపతి అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ‘జైలర్-2’లో క్యామియోకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మూవీపై తన పోస్టర్ వేసినా ఆడియన్స్ ఆయన్నే చూస్తారని, అదే చిన్న సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తే తన పోస్టర్తోనే మార్కెటింగ్ చేస్తారని పేర్కొన్నారు. దీంతో తను హీరోగా చేస్తున్న మూవీస్పై ఎఫెక్ట్ పడుతోదన్నారు.
సార్.. మీ హెల్మెట్ ఏది..?
AP: విశాఖపట్నంలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్తున్న ఇద్దరు పోలీసులను ధైర్యంగా ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీహరిపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సార్.. మీ హెల్మెట్ ఏది అని యువకుడు నిలదీయగా, విధుల్లో ఉన్నామని పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే యువకుడు మాకు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారు.. మీకు రూల్స్ వర్తించవా అని ప్రశ్నించాడు. దీంతో ఓ పోలీస్ తన తప్పును అంగీకరిస్తూ, నువ్వు అడిగింది కరెక్టే.. ఇకపై ఇలా జరగదు అని చెప్పారు.

నటనతో షేక్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్!
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా మనముందుకు వస్తున్నారు. ‘బలగం’ డైరెక్టర్ వేణు యెల్దండి తీస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'పర్షి' పాత్ర ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు.

బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులు
మహిళా రెజర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 2023లో రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చేసిన నిరసనలతో ఈ కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు 2023 జూన్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు భారత కుస్తీ సమాఖ్య(WFI) మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్లను నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది.

'పుస్తక హుండీ'తో పాత పుస్తకాలకు కొత్త ఊపిరి!
మన ఇంట్లో చదవడం పూర్తియిపోయి, మూలన పడేసిన పాత పుస్తకాలకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) 'బుక్ హుండీ' ద్వారా కొత్త జీవం పోస్తోంది. మనం దాచుకున్న పుస్తకాలను ఇక్కడ డొనేట్ చేస్తే, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు, పుస్తక ప్రియులకు వాటిని ఉచితంగా ఇస్తున్నారు. ఎవరైనా సరే తమకి నచ్చిన రెండు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళొచ్చు. గడిచిన పదేళ్లలో ఇలా దాదాపు 2 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. పుస్తకాలు చదివేవాళ్లు దాతలుగా, దాతలు పాఠకులుగా మారుతూ ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు.

హైవేపై పల్టీలు కొట్టిన లారీ
AP: అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం సమీపంలోని నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఒక లారీ మరో లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొడుతూ సర్వీస్ రోడ్డుపై పడి కలెక్టర్ కార్యాలయ రహదారికి అడ్డంగా పడింది. మరో లారీ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు లారీల్లో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రెండు భారీ క్రేన్లతో లారీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

భారత్లో హాలీవుడ్ హవా: 2026 రికార్డుల సంవత్సరం!
2026 మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకు బిగ్గెస్ట్ ఇయర్గా నిలిచింది. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'ది ఒడిస్సీ', 'అవేంజర్స్: డూమ్స్డే' వంటి భారీ సినిమాలు థియేటర్లలో హౌస్ఫుల్ అవుతున్నాయి. హాలీవుడ్ క్రేజ్ చూసి, మన ఇండియన్ మూవీ మేకర్స్ కూడా వాళ్ళతో డైరెక్ట్గా పోటీపడకుండా రిలీజ్ డేట్లను వెనక్కి ముందుకి జరుపుకుంటున్నారు. చిన్న నగరాల నుండి ఐమాక్స్ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు హాలీవుడ్ హవాయే నడుస్తోంది.

ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభం
TG: ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 ఇయర్ అడ్మిషన్స్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. M.A, MBA, MCA, M.Com, M.Scతో పాటు BA, B.Com, BBA, Diploma సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్స్ ఇస్తున్నారు. పీజీ కోర్సులు నాలుగు సెమిస్టర్లు, యూజీ కోర్సులు ఆరు సెమిస్టర్లుగా ఉంటాయి. MA పొలిటికల్ సైన్స్ను తెలుగు మీడియంలో కూడా అందిస్తున్నట్లు యూనివర్సిటీ నోటిఫికేషన్లో తెలిపింది. <a href="https://oupgrrcde.com/Registration/Student/Default">అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</a>

రామాయణ కాస్ట్యూమ్స్పై సోషల్ మీడియాలో రచ్చ!
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'రామాయణ' కాస్ట్యూమ్స్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), సాయి పల్లవి (సీత) లుక్లు ఆధునిక మోడలింగ్ స్టైల్లో ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది త్రేతాయుగమా లేక 2026 మోడరన్ ఫ్యాషనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రామాయణం నాటి పౌరాణిక వాతావరణం లోపించి, సీరియల్ కాస్ట్యూమ్స్లా ఉన్నాయని విమర్శిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి
AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి లావణ్య (25), రెండేళ్ల కుమార్తె కీర్తన మృతి చెందగా, తండ్రి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. భాష్యం బ్లూమ్స్ స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబం, స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్ గదిలో యువతి సూసైడ్
AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం(26) విశాఖపట్నంలోని గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమె సన్నిహితుడు లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఓ హోటల్లో గది తీసుకున్న ఆమె, ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా రషీదా బేగం స్కార్ఫ్తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముంపు గ్రామాలపై ఎందుకింత నిర్లక్ష్యం: షర్మిల
AP: గోదావరి వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీని పొగడటంలో చూపుతున్న శ్రద్ధ, వరద బాధితులపై లేదని ఫైరయ్యారు. వంద గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం తక్షణ పునరావాసం కల్పించడంలో విఫలమైందన్నారు. బాధితుల కన్నీళ్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు ఆహారం, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు.

టెలిగ్రామ్లో జాబ్ ఆఫర్.. భారీ మోసం
TG: టెలిగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో వచ్చిన మెసెజ్ను నమ్మిన HYDలోని దిల్సుఖ్నగర్కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్ రూ.4.31 లక్షలు కోల్పోయాడు. మొదట గూగుల్ రివ్యూలు పూర్తిచేస్తే పారితోషికం ఇచ్చి నమ్మకం కల్పించిన సైబర్ మోసగాళ్లు, తర్వాత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. తొలుత లాభాలు చెల్లించడంతో బాధితుడు కుటుంబసభ్యుల సహకారంతో దశలవారీగా పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాడు. చివరకు రూ.4.31 లక్షలు కోల్పోయిన తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి
AP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (RPC) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను వేధించడం సరైంది కాదన్నారు.

లిఫ్ట్ అడిగి.. కత్తితో బెదిరించి దోపిడీ
TG: లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు, ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకున్న ఆరుగురు యువకులను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ నగర్లో జూలై 31న పద్మారావు అనే వ్యక్తి నుంచి లిఫ్ట్ తీసుకున్న ఓ యువకుడు, కొద్దిదూరం వెళ్లిన తర్వాత మరో ఐదుగురితో కలిసి బాధితుడిని బెదిరించి రూ.5వేల నగదుతో పాటు గూగుల్ పే ద్వారా రూ.800 బదిలీ చేయించుకున్నారు. పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్గా సేవలను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. జొమాటో, స్విగ్గీ కన్నా తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించాలనే వ్యూహంతో ఫ్లిప్కార్ట్ ముందుకొస్తోంది. ఇతర సంస్థలు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్కార్ట్ సుమారు 10 శాతం మాత్రమే వసూలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్ను కూడా తీసుకురానుంది.

కృష్ణా, గోదావరి జలాలపై కలిసి పోరాడాలి
AP: గోదావరి, కృష్ణా నది జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలైతే ఏపీ, తెలంగాణ రెండూ నీటి నష్టాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించారు. దీనిపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

హామీలు నెరవేర్చండి.. లేదంటే ఉద్యమం తప్పదు
AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంపై AP JAC తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడలో JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆగస్టు 15లోగా ఉద్యోగుల ఆర్థిక, సేవాపరమైన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.