Latest

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం
Infotainment· 30 Jul 2026

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ రేటుకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలుపెట్టనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు ఇవ్వనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..
Cinema· 30 Jul 2026

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..

దుల్కర్ సల్మాన్ హీరోగా, కయడు లోహర్ హీరోయిన్‌గా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'ఐ యామ్ గేమ్'. జూలై 28న విడుదల కావాల్సిన సినిమా ట్రైలర్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 20, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'
Sports· 30 Jul 2026

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'

టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి వదిలేసి 'టెన్ డస్కటే' మళ్లీ KKR జట్టులోకి వచ్చాడు. ఇంతకుముందు అతను ఇదే జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు అతనికి 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ' బాధ్యతలు ఇచ్చారు. ఆట గురించి అతనికి బాగా తెలుసని ఆ అనుభవం తమ జట్టుకు పనికొస్తుందని KKR మేనేజ్‌మెంట్‌ చెప్పింది.

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం
TG· 30 Jul 2026

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం

TG: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం <a href="https://www.theclearcutnews.com/n/oGAcrp9">హైఅలర్ట్</a> ప్రకటించింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వాగులు, వంతెనల వద్ద పోలీసులు, SDRF బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, తాళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దన్నారు.

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!
Politics· 30 Jul 2026

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!

Gen Z పై MP కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై లక్నోలో ప్రొటెస్టర్స్, ఆమె దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అవ్వగా, అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ దిష్టిబొమ్మను లాక్కుని, వారు తగలేయకుండా విపరీతమైన స్పీడ్‌తో పరుగులు తీస్తూ ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 30 Jul 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈనెల 24న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదించింది. ఇవాళ మూజువాణి ఓటుతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా పాడుతున్న టైంలో ఆటంకం కలిగించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు.

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి
Politics· 30 Jul 2026

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు సీఎం కావాలనే కోరిక లేదు. సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నారు. కానీ నాకు మరో బలమైన రాజకీయ కోరిక ఉంది. నా మనసులోని మాటలన్నీ నవంబర్‌లో బయటపెడతాను. అప్పుడే నా రాజకీయ కోరిక ఏమిటో చెబుతాను' అని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో చర్చకు దారితీశాయి.

‘శ్రీనివాస మంగాపురం’ టాక్
Cinema· 30 Jul 2026

‘శ్రీనివాస మంగాపురం’ టాక్

ఘట్టమనేని జయకృష్ణ, రషా తడానీ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీకి సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. జయకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, రషా స్క్రీన్ ప్రెజెన్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, మోహన్ బాబు నటన మెప్పించాయి. అయితే రొటీన్ కథ, ముందే ఊహించగలిగే స్క్రీన్‌ప్లే, ట్విస్టులు లేవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వసూళ్లపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.

ఒక్క తప్పు.. అమెరికా డ్రీమ్‌కు బ్రేక్ వేయొచ్చా..?
Politics· 30 Jul 2026

ఒక్క తప్పు.. అమెరికా డ్రీమ్‌కు బ్రేక్ వేయొచ్చా..?

"అమెరికా వెళ్లే వాళ్లకు కొత్త టెన్షన్ మొదలైందా?" ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనతో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. J-1 వీసాపై అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు వీసా కోసం తప్పుడు సమాచారం లేదా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు తేలితే.. వారి ప్రోగ్రామ్‌ను వెంటనే రద్దు చేసేలా కొత్త రూల్‌ను ప్రతిపాదించింది. అలాంటి వారికి అమెరికా విడిచిపోవాల్సి రావొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటికి డ్రాఫ్ట్ రూల్ మాత్రమే.

వరద నీళ్లు వస్తున్నా.. పంప్‌లు ఆన్ చేయడం లేదు
Politics· 30 Jul 2026

వరద నీళ్లు వస్తున్నా.. పంప్‌లు ఆన్ చేయడం లేదు

తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రాజెక్టుల పంపులను పూర్తిస్థాయిలో నడపడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జూరాల నుంచి పవర్ జనరేషన్ పేరుతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, అదే సమయంలో రిజర్వాయర్లను నింపే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతుల ఆందోళన తర్వాతే కొన్ని పంపులను ప్రారంభించారని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ప్రతి చుక్క నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు Radical Ajay పిలుపు
Infotainment· 30 Jul 2026

రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు Radical Ajay పిలుపు

తెలుగులో ఉన్న రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు, కంటెంట్ క్రియేటర్లకు అంబేడ్కరైట్, కంటెంట్ క్రియేటర్ ర్యాడికల్ అజయ్(Radical Ajay) పిలుపునిచ్చారు. వారితో పోడ్‌కాస్ట్ డిస్కషన్ చేసేందుకు తను సిద్ధమని, అందుకు తనే స్టూడియో ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ డిస్కషన్‌ను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా అప్‌లోడ్ చేస్తానని, నిజాలు, ఆధారాలతో మాత్రమే ఈ డిస్కషన్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రూల్స్ కూడా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు radicalajaykumar@gmail.comకి మెయిల్ చేయాలని చెప్పారు.

వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య
Crime· 30 Jul 2026

వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య

AP: తిరుపతికి చెందిన జగదీశ్ (47) కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంపేటలోని ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఆయన, భార్యతో జరిగిన వాగ్వాదం అనంతరం చంద్రగిరిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఆత్మహత్యకు ముందు భార్యకు వీడియో కాల్ చేసి తన నిర్ణయాన్ని తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, జగదీశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భోజనం లేట్ అయ్యిందని వదినపై దారుణం
Crime· 30 Jul 2026

భోజనం లేట్ అయ్యిందని వదినపై దారుణం

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో భర్త పొలానికి వెళ్లగా భార్య అన్షు దేవి(25) ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమె మరిది 'కునాల్' ఇంటికి వచ్చి భోజనం అడిగాడు. అన్నం పెట్టడం లేట్ అవ్వడంతో గొడ్డలి తీసుకొని వదిన తల నరికేశాడు. ఆ తలను ఇంటి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీసి, పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. అక్కడి వాళ్లు పోలీసులకు చెప్పడంతో వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కునాల్ ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉండేవాడనీ ఊరివాళ్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

10 ఏళ్ల ‘పెళ్లిచూపులు’
News· 30 Jul 2026

10 ఏళ్ల ‘పెళ్లిచూపులు’

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ సినిమా ‘పెళ్లిచూపులు’ (2016) ఈ రోజూ తో విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, విజయ్ దేవరకొండ తన 'x 'లో పోస్ట్ చేస్తూ, తన కెరీర్‌కు పునాది వేసిన ఈ సినిమా, దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత రాజ్‌ కందుకూరి, టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రెండు (National Awards) జాతీయ అవార్డులు సాధించి టాలీవుడ్‌లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

"అమిత్ షా రావాల్సిందే"..  ప్రతిపక్షం వాక్‌అవుట్!
Politics· 30 Jul 2026

"అమిత్ షా రావాల్సిందే".. ప్రతిపక్షం వాక్‌అవుట్!

పేపర్ లీక్ ఇష్యూ ఇంకా పార్లమెంట్‌ను వదలట్లేదు. నిన్న లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌తో హీట్ పెరగగా.. ఇవాళ అదే ఇష్యూపై రాజ్యసభలో కూడా రచ్చ కొనసాగింది. "జూలై 20న విద్యార్థులపై పోలీసులు ఎందుకు బలప్రయోగం చేశారు..? అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలి" అంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సమాధానం ఇవ్వాలంటూ పట్టుబట్టిన వారు చివరకు సభ నుంచి వాక్‌అవుట్ చేశారు. మరోవైపు.. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగనుంది.

మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్
TG· 30 Jul 2026

మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్

TG: హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గచ్చిబౌలి ఆల్ సబా హోటల్ సమీపంలో రాయదుర్గం పోలీసులు తనిఖీలు నిర్వహించగా, అంబులెన్స్ డ్రైవర్ రాఘవేంద్ర మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతనికి ఏకంగా 324 రీడింగ్ నమోదవడంతో పోలీసులు షాకయ్యారు. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌ను ఇంత ప్రమాదకర స్థితిలో నడపడం తీవ్ర నిర్లక్ష్యంగా పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌పై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అంబులెన్స్‌ను సీజ్ చేశారు.

ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు
AP· 30 Jul 2026

ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు

AP: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం భారీ ఆందోళన చేపట్టారు. మార్కాపురం–ఎర్రగొండపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు రూ.1000 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద
TG· 30 Jul 2026

కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని జిల్లా SP జానకి షర్మిల క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు సమీపానికి వెళ్లొద్దని, వరద నీటిలో సెల్ఫీలు, ఫోటోలు తీయొద్దని హెచ్చరించారు.

స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు
Crime· 30 Jul 2026

స్టూడెంట్స్‌కు EMIలో డ్రగ్స్ అమ్ముతున్న టీచర్లు

కేరళలో కోజికోడ్‌లోని పెరంబ్రా బ్లాక్ రిసోర్స్ సెంటర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరిపింది. ఇందులో గవర్నమెంట్ టీచర్లు డ్రగ్స్ ఏజెంట్లుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఇద్దరు టీచర్లు పోలీసులు అరెస్టు చేయగా, ఈరోజు ఇంకో టీచర్ను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్‌కు EMI పద్ధతిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఒకవైపు విద్యార్థుల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ, మరోవైపు వారికే డ్రగ్స్ అమ్మడం గమనార్హం.

స్నేహితుడిపై కత్తితో దాడి
Crime· 30 Jul 2026

స్నేహితుడిపై కత్తితో దాడి

TG: తనకంటే బాగా చదువుతున్నాడనే అసూయతో ఓ విద్యార్థి తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోబిన్, నిజాం ఇద్దరూ ఒకే ట్యూషన్ సెంటర్‌లో చదువుకుంటున్నారు. చదువులో మోబిన్ ముందుండటాన్ని జీర్ణించుకోలేక నిజాం కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మోబిన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏపీలో కరోనా భయంతో తెలంగాణలో పరీక్షలు
Health· 30 Jul 2026

ఏపీలో కరోనా భయంతో తెలంగాణలో పరీక్షలు

TG: ఆంధ్రలో కొత్తగా 49 కోవిడ్ కేసులు రావడంతో తెలంగాణలో జనాలు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని హాస్పిటల్ ల్లో కరోనా పరీక్షల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ట్రావెల్ చేసి వచ్చినవాళ్లు, చిన్నపాటి అనారోగ్య లక్షణాలు ఉన్నవాళ్లు ఈ పరీక్షలకు వస్తున్నారు. అయితే, ఇప్పటివరకు చేసిన టెస్ట్ ల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని డాక్టర్లు చెప్పారు. జలుబు, జ్వరం, శ్వాస సమస్యలు ఉంటేనే పరీక్షలు చేసుకోవాలని అధికారులు తెలిపారు.