Latest

బంగారం కోసం దారుణ హత్య.. ఇద్దరికీ జీవిత ఖైదు
AP: కాకినాడ జిల్లాలో 2023లో జరిగిన పప్పు సత్యవతి హత్య కేసులో పిఠాపురం జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎర్రకోనేరులో సత్యవతిని కత్తులతో దాడిచేసి హత్య చేసిన అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలను నిందితులు దోచుకెళ్లారు. కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన సునీల్ సాహు, ఒడిశాకు చెందిన రాజ్ బిందాసింగ్పై నేరం రుజువైంది. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులపై అభియోగాలు నమోదు చేసి, ఆధారాలతో నేరం నిరూపించినట్లు తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు.

రూ.30 లక్షల డ్రగ్స్.. మాజీ Air Hostess అరెస్ట్
గుజరాత్ వడోదర నుంచి ముంబైకి డ్రగ్స్ సప్లై చేస్తున్న మాజీ Air Hostessను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ దిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఓ కారును చెక్ చేయగా 977 గ్రా. మెఫెడ్రోన్ దొరికింది. దీని Value రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మాజీ క్యాబిన్ క్రూ మాన్సీ సయీద్, సోహైల్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో డ్రగ్స్ను చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నట్లు Inquiryలో తెలిసింది. మాన్సీకి 2015 నుంచే డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతుల పొలాల గట్లపై 50 వేల టేకు స్టంపుల పంపిణీ
TG: కామారెడ్డి జిల్లాలోని మండలాలకు మొత్తం 50,000 టేకు స్టంపులను పంపిణీ చేశారు. రైతుల పొలాల గట్లు, ఇతర అనువైన ప్రాంతాల్లో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 టేకు స్టంపుల నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు DAO మోహన్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ పొలాల గట్లపై టేకు మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మమితా బైజు - నివిన్ పౌలీ కాంబోలో కొత్త లవ్ స్టోరీ!
‘ప్రేమలు’ హిట్ తర్వాత మమితా బైజు, నివిన్ పౌలీ కాంబినేషన్లో వస్తున్న కొత్త లవ్ స్టోరీ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. గిరీష్ ఏడీ డైరెక్షన్లో భావనా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 4న వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘ప్రేమలు’ లాగే ఈ మూవీని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తూ <a href="https://x.com/NivinOfficial/status/2091904918949122315?s=20">హీరో నివిన్</a> పౌలీ 'X'లో షేర్ చేశారు.

గ్రానైట్ క్వారీలపై గ్రామస్తుల పోరుబాట
AP: గ్రానైట్ క్వారీలతో పర్యావరణం దెబ్బతింటోందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ఉర్లావ రెవెన్యూ పరిధిలో అమర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించి నిర్వహించనున్న ప్రజా అభిప్రాయ సేకరణను రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. క్వారీల నిర్వహణతో కొండగట్లు ధ్వంసమవుతున్నాయని, చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము గిరిజనుల పంట పొలాలపై పేరుకుపోయి పంటలకు నష్టం కలిగిస్తోందన్నారు.

అమరావతి అగ్ని ప్రమాదం..తండ్రికి తీరని వేదన
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రి NICUలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. వీరిలో పుల్గావ్కు చెందిన స్వప్నిల్ బోర్గే కుమారుడు కూడా ఉన్నాడు. తనకు మగబిడ్డ పుట్టాడని స్వప్నిల్ ఆనందంతో స్వీట్లు పంచాడు. కొడుకు ముఖం చూడకుండానే వెంటిలేటర్ షార్ట్ సర్క్యూట్తో బిడ్డ మరణించాడు. “ఇంకా ముఖం కూడా చూడలేదు. ఈ విషయం నా భార్యకు ఎలా చెప్పాలో తెలియడం లేదు” అని అతను దీనంగా ఆసుపత్రి బయట కూర్చొన్న ఫొటో కంటతడి పెట్టిస్తోంది.
కోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మంత్రి
AP: పల్నాడు జిల్లా,చిలకలూరిపేట: అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ దంపతులను మాజీ మంత్రి విడుదల రజిని పరామర్శించారు. మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ, న్యాయపరంగా పోరాటం చేసి అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చిన రజిని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

పొట్లూరులో కార్డెన్ సెర్చ్.. 54 వాహనాలు సీజ్
AP: గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్డివిజన్ పరిధిలోని శావల్యాపురం మండలం పొట్లూరులో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

చెక్కుచెదరని స్నేహం.. మిత్రురాలికి రూ.56వేల చేయూత
TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ 2004-05 SSC బ్యాచ్ మిత్రులు తమ స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అనుకోని ప్రమాదంతో గంగసాగర చేతి వేలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు దానిని తొలగించారు. ఇద్దరు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మిత్రులు స్పందించారు. మిత్రులు రూ.40 వేలు, మిత్రురాళ్లు రూ.16 వేలు కలిపి మొత్తం రూ.56 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి గంగసాగర కుటుంబానికి అందజేశారు.

దాములూరులో పోలీసుల పల్లె నిద్ర.. ప్రజలకు కీలక అలర్ట్
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో పోలీసులు నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీఐ ఎ.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎవరితోనూ ఓటీపీలు పంచుకోవద్దని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. యువత **‘ఈగల్ ఛాలెంజ్’**లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

శ్రీశైలంలో విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
AP: శ్రీశైలం ఆలయ దగ్గరలోని సత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 20న ఆటోలో వచ్చిన ఫామిలీ వడ్డెర సత్రంలో రూమ్ను బుక్ చేసుకున్నారు. దర్శనం తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు బాత్రూమ్లో, మరో ఇద్దరు ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మూఢనమ్మకాలా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ముంబై మెట్రోకి అదిరిపోయే కొత్త బాస్
ముంబై మెట్రోకి కొత్త బాస్ వచ్చింది. ఆ బాస్కి నాలుగు కాళ్లున్నాయి. అవును. ఓ పిల్లి ఇప్పుడు ముంబై మెట్రోకి బాస్ అయ్యింది. మెట్రో అధికారికంగా తమ ఫస్ట్ ఎవర్ ‘Chief Feline Officer’ని నియమించింది. అయితే ఇదంతా సరదాకే! Sandesh Samant అనే ప్రయాణికుడు మెట్రో ఏరియాలో ఉన్న ఆ పిల్లిని ఫోటో తీసి మెట్రోకు ట్యాగ్ చేసి “ఇది ఉచితంగా పని చేస్తోంది. దీనికి అధికారిక పదవి ఇవ్వండి” అని జోక్గా రాశాడు. మెట్రో ఆ జోక్కి రిప్లై ఇస్తూ ఆ పిల్లి తమ ‘Chief Feline Officer’ అని డిక్లేర్ చేశారు. అదన్నమాట సంగతి!

సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్
సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. ఇండియా ఈ ఏడాది బ్రిక్స్ చైర్గా ఉంది. ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ ఈ ఏడాది థీమ్. ప్రస్తుతం ఇండియా ప్రయారిటీల్లో సప్లై చైన్స్ బలోపేతం, క్లైమెట్-రిజిలియెంట్ ఇన్ఫ్రా, అగ్రికల్చర్, హెల్త్, ఇన్నోవేషన్ పార్టనర్షిప్స్, క్లీన్ ఎనర్జీ + సస్టైనబుల్ గ్రోత్ ఉన్నాయి. అయితే జియోపాలిటికల్ టెన్షన్స్, మెంబర్ల మధ్య భేదాభిప్రాయాలు, UAE-ఇరాన్ మధ్య స్పార్స్ కొంత ఇబ్బందిగా ఉండబోతున్నాయి.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
TG: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపి నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో, ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రజావేదికకు పోటెత్తిన జనం.. 214 ఫిర్యాదులు
AP: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులను డీఆర్వో వి.సుబ్బారావు ఆదేశించారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. భూరికార్డుల ఆన్లైన్ నమోదు, రీసర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగాలు, పారిశుధ్యం, మురుగు కాలువల సమస్యలు, ఇళ్ల స్థలాలు, గృహాలు, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, రహదారుల మంజూరు తదితర అంశాలపై మొత్తం 214 అర్జీలు అందాయి.

రైతుల అనుమతి లేకుండా విల్లా ప్రాజెక్టుకు అనుమతులా..?
AP: రైతుల సమ్మతి లేకుండానే 90 ఎకరాల విల్లా ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారంటూ అమరావతి, తాడేపల్లి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి మున్సిపల్ కమిషనర్కు రైతులు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా డెవలపర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని వారు ఆరోపించారు. తాజాగా తమకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారని, భూములను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రైతుల అనుమతి లేకుండా ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపివేయాలని కోరారు.

ఢిల్లీ వేదికగా మళ్ళీ రోడ్డెక్కనున్న CJP!
స్టూడెంట్స్ పై ఫైల్ అయిన FIRలను వెనక్కి తీసుకుంటామని ఇచ్చిన హామీలను గవర్నమెంట్ నెరవేర్చలేదని <a href="https://x.com/Cockroachisback/status/2091857950088536455?s=20">CJP</a> ఆరోపించింది. జూలై 25న హామీలు ఇవ్వడంతో నిరసన విరమించినా, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడింది. దీనికి నిరసనగా సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు భారీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. NEET బాధితుల కుటుంబాలు, స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటారని CJP నేషనల్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది.

మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
TG: ఈ నెల 26న మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎస్డీపీవో శాంతి కమిటీ సభ్యులతో పండుగ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను సంతోషంగా నిర్వహించాలని కోరారు.

టెర్రస్పై నుంచి దూకిన మహిళ.. అక్కడికక్కడే మృతి
TG: హైదరాబాద్ KPHBలో దారుణ ఘటన జరిగింది. పంచవటి అపార్ట్మెంట్స్లో శీతల్ (32) అనే మహిళ మృతి చెందారు. నిన్న సా. 4 గం. సమయంలో టెర్రస్పైకి వెళ్లి ఐదో ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. శీతల్ కొంతకాలంగా డిప్రెషన్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆమె భర్త పోలీసులకు తెలిపారు. వీరు కేరళంలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై KPHB పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

చాందినీ చౌక్లో ఢిల్లీ ఓల్డెస్ట్ లైబ్రరీ గురించి తెలుసా?
ఢిల్లీలోని చాంద్నీ చౌక్ అంటే ఎప్పుడూ సందడిగా, రద్దీగా ఉండే ఏరియా. అక్కడే ఒక పాత బిల్లింగ్లో ఉండే ‘Hardayal Municipal Heritage Public Library’ గురించి చాలామందికి తెలియదు. 1862లో స్టార్ట్ అయిన ఈ లైబ్రరీ ఢిల్లీ ఓల్డెస్ట్ పబ్లిక్ లైబ్రరీ. 1916లో ఇప్పుడున్న బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది. ఇక్కడ సుమారు 1.7 లక్షలకుపైగా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, పర్షియన్, సంస్కృతం భాషల బుక్స్ ఉన్నాయ. 1600 నాటి చేతిరాత పుస్తకాలు సైతం ఇక్కడున్నాయి. పర్షియన్ భాషలోకి అనువాదమైన మహాభారతాన్ని ఇక్కడ మనం చూడొచ్చు.

మల్లారెడ్డి కన్నుమూత.. రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు
TG: సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ వామపక్ష, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శ్రీనివాసులు అన్నారు. నాగర్కర్నూల్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మల్లారెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల హక్కులు, సాగునీరు, విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డి అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.