Latest

జీవో 97ను వెనక్కి తీసుకోండి
Local· 24 Aug 2026

జీవో 97ను వెనక్కి తీసుకోండి

హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ సెంటర్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు రోడ్డు ఎక్కి దర్నా చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 97 వల్ల తమ చదువులు, భవిష్యత్తు నాశనమైపోతాయని రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల ముఖ్యంగా పేద పిల్లలే నష్టపోతున్నారని అంటున్నారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర గట్టిగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!
TG· 24 Aug 2026

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!

TG: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, భారీ హోర్డింగులు, పెద్ద చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాలకు Yellow అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?
Local· 24 Aug 2026

ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?

భీమదేవరపల్లిలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి రాకపోవడంతో న్యాయవాది తాళ్లపల్లి మధుకర్ ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఎంపీడీవో ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో – అధికారులిచ్చిన టైమ్‌కు వాళ్లే రాలేదట. "ప్రజా సమస్యల కోసం వచ్చిన వాళ్లందరూ ఎదురుచూడాల్సిందేనా?" అంటూ మధుకర్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు."అధికారులే లేట్ అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలే" – ఇదీ ఆయన ప్రశ్న. ఇప్పుడు ఈ ఫిర్యాదు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకుని ఓ క్లియర్ మెసేజ్ ఇస్తారో లేదో చూడాలి.

రామాయంపేట రోడ్లపై నరకయాతన.. స్థానికుల ఆవేదన
Local· 24 Aug 2026

రామాయంపేట రోడ్లపై నరకయాతన.. స్థానికుల ఆవేదన

TG: చిన్న వర్షానికే రామాయంపేట రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.. గుంతల్లో నిలిచిపోతున్న వర్షపు నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల్లో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు నీటితో నిండిపోవడంతో వాటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదన్నారు.

ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ
Local· 24 Aug 2026

ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ

AP : ఆంధ్రప్రదేశ్‌లోని 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70 భూ బదిలీ నిరోధక చట్టమే కొండంత అండ. కానీ, ఈ చట్టాన్ని సవరించాలని కోరుతూ 2023లో 1,672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ పక్షాన గట్టిగా నిలబడి, హక్కుల రక్షణ కవచమైన 1/70 చట్టాన్ని కాపాడాలని ఆదివాసీ సమాజం ఆశగా ఎదురుచూస్తోంది.

1/70 పై ఎపి కౌంటర్?
Local· 24 Aug 2026

1/70 పై ఎపి కౌంటర్?

ఏపీ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూహక్కులకు కవచమైన 1/70 చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టులో టక్కర్‌కు సిద్ధంగా ఉంది. 2023లో 1,672 మంది గిరిజనేతరులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి భూములు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందని వారి వాదన. ఇప్పటికే అల్లూరి జిల్లాలో ఆదివాసీలు భారీ ర్యాలీలు నిర్వహించినప్పుడు, ఆదివాసీల తరఫున సుప్రీంలో కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని మర్చిపోయింది.. ఇప్పటికైనా మేల్కొంటుందా?

ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
Local· 24 Aug 2026

ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని ఐటీడీఏ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి తిని, నాణ్యతపై హాస్టల్ వార్డెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, పాఠశాల పరిసరాల్లో తిరిగి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వసతులు కల్పించాలని హెడ్‌మాస్టర్‌ను ఆదేశించారు.

మద్యం మత్తులో హల్‌చల్.. వాహనదారులకు టెన్షన్
Local· 24 Aug 2026

మద్యం మత్తులో హల్‌చల్.. వాహనదారులకు టెన్షన్

AP: విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ జంక్షన్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వాహనాలకు ఎదురుగా పడుకుని వాటిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ పరిస్థితిని గమనించి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. దీంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

శిలాఫలకం వేసి మూడేళ్లైనా.. రోడ్డు పనులు ఏవి?
Local· 24 Aug 2026

శిలాఫలకం వేసి మూడేళ్లైనా.. రోడ్డు పనులు ఏవి?

TG : మోత్కూర్ మండలం సదర్శాపురం కొమ్మూరిబావి దగ్గర రోడ్డు చాలా రోజులుగా దారుణంగా ఉంది. వర్షం పడితే, ఊరంతా బురదగా అవుతుందని ప్రజలు అంటున్నారు. రోడ్డు వేస్తామని శిలాఫలకం వేసి, నిధులు మంజూరై మూడేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు పనులు మొదలుకావట్లేదని తెలిపారు. నడిచేవాళ్లు, బైక్‌లపై వెళ్లేవాళ్లు ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే ఈ రోడ్డు పని పూర్తి చేసి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఫార్చూనర్లో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న కార్మికుడు
Motivational· 24 Aug 2026

ఫార్చూనర్లో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న కార్మికుడు

కర్ణాటక దక్షిణకన్నడ జిల్లా బంట్వాళకు చెందిన శేషప్పణ్ణ అనే పారిశుధ్య కార్మికుడు రోజూ లగ్జరీ ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చడం వైరల్ అవుతోంది. 1996లో రూ.50 కూలీగా చేరి పర్మినెంట్‌ ఉద్యోగి అయిన ఆయన, ఆఫ్టర్‌నూన్ పశువుల పెంపకం ద్వారా నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. ఈ హార్డ్‌వర్క్‌తో ఆల్టో, స్కోర్పియోల నుంచి ఫార్చూనర్ కార్ దాకా కొనుగోలు చేశారు. గతంలో మద్యానికి బానిసనై ఎన్నో కోల్పోయానని, ఏ పని చేస్తున్నామనేది కాదని, గౌరవమే ముఖ్యమని శేషప్పణ్ణ చెప్తున్నారు.

రూ.146 కోట్లు.. నాగర్ కర్నూల్లో రోడ్ల రేసులు!
Local· 24 Aug 2026

రూ.146 కోట్లు.. నాగర్ కర్నూల్లో రోడ్ల రేసులు!

బల్మూర్‌లో రోడ్ల డెవలప్మెంట్ కి భారీ బడ్జెట్! రూ.146.71 కోట్లతో మూడు కీలక రహదారులను HAM మోడల్‌లో అప్గ్రేడ్ చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్–తొల్పలపల్లి, బల్మూర్–నాగర్‌కర్నూల్, అచ్చంపేట–రాకొండ – ఈ మూడు రోడ్లను రెండు లేన్లుగా విస్తరించనున్నారు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో ట్రాఫిక్ స్మూత్ అవ్వడమే కాదు, వ్యాపార, రవాణా రంగాలకు కూడా ఊతం లభించనుంది. బూస్టప్ లాంటి ఈ ప్రాజెక్టు పనులు టార్గెట్ టైమ్‌లో పూర్తయితే, ఇక్కడి ప్రజలు ఖుషీ ఖుషీ!

సైబరాబాద్‌లో చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు!
Current Affairs· 24 Aug 2026

సైబరాబాద్‌లో చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు!

TG: హైదరాబాద్ నుంచి ఏపీకు చికెన్ వేస్టును అక్రమంగా తీసుకెళ్తున్న మాఫియాపై సైబరాబాద్‌ పోలీసులు, వెటర్నరీ అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను రికవరీ చేసుకున్నారు. ఈ వ్యర్థాలను రాత్రివేళల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు ఆమూతున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

డ్రైనేజీ పనులు స్లో.. కలెక్టర్ మాటకు లెక్కలేదా?
Local· 24 Aug 2026

డ్రైనేజీ పనులు స్లో.. కలెక్టర్ మాటకు లెక్కలేదా?

సూర్యాపేటలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల వల్ల రోడ్లు ఇప్పుడు ట్రెంచ్‌లా మారాయి. గుంతలు తవ్వి పైపులు వేశారు కానీ, మళ్లీ రోడ్లను ఎత్తి పూడ్చలేదు – ఇది ఓ సీరియస్ ఇష్యూ. బాలాజీనగర్, శ్రీరాంనగర్, విద్యానగర్ – ఇక్కడి ప్రజలు వాహనాలు నడిపించలేని పరిస్థితి. ఇది ఇప్పుడొచ్చిన సమస్య కాదు – కలెక్టర్ ఇప్పటికే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్డర్లు ఇచ్చినా, ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్‌లోనే! వర్షాకాలం మొదలైంది – గుంతల్లో నీరు నిల్వ ఉంటే, ఆ ప్రమాదం ఎవరికి తెలుసు? పాదచారులు, వాహన డ్రైవర్లకు కష్టం కదా!

దింసాకు గిన్నిస్ వచ్చింది.. క్రెడిట్ ఎవరికి?
AP· 24 Aug 2026

దింసాకు గిన్నిస్ వచ్చింది.. క్రెడిట్ ఎవరికి?

భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ కోసం 13,000 మంది ఆదివాసీలతో దింసా నృత్యం చేయించి ప్రభుత్వం గిన్నిస్ రికార్డ్ కొట్టేసింది. కిల్లర్ ఫీట్ అనుకుంటారా? కానీ ఈ నృత్యకారుల పరిస్థితి చూడండి. ASR జిల్లా 11 మండలాల్లో వేలాది మంది ఉంటారు. ప్రభుత్వ ఈవెంట్స్ కు వాళ్లని వాడేస్తారు, కానీ వాళ్లకి గుర్తింపు కార్డ్ లేదు, వాయిద్యాలు లేవు, డ్రెస్ లేదు, పెన్షన్ లేదు! రికార్డు కొట్టేటప్పుడు గుర్తొచ్చి, ఇక 'అవసరమైతే కాల్ చేస్తాం' అనేస్తే, ఈ రికార్డుకు అసలు అర్థమేంటి? ఆదివాసీ సంస్కృతి ఇలా 'షో' కి పరిమితమవ్వొద్దు!

అర్జీలు తీసుకుని.. స్పాట్‌లోనే ఆర్డర్లు!
Local· 24 Aug 2026

అర్జీలు తీసుకుని.. స్పాట్‌లోనే ఆర్డర్లు!

గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ సీ.ఎం.సాయి కాంత్ వర్మ నేరుగా ప్రజల అర్జీలు స్వీకరిస్తూ, స్పాట్‌లోనే అధికారులకు ఆర్డర్లు జారీ చేశారు. "వెంటనే పరిష్కరించండి" అని సంబంధిత శాఖల వారిని పిలిపించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, డీఆర్వో ఖాజావలి, డీపీవో సాయికుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇలాంటి స్పాట్‌సొల్యూషన్స్ రెగ్యులర్గ అమలైతే.. ప్రజా పరిపాలన ఇంకా స్మూత్ అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం!

రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!
Local· 24 Aug 2026

రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!

ఏపీలో విండ్ ఎనర్జీది కొత్త చాప్టర్! అనంతపురం రాయదుర్గంలో సుజ్లాన్ రూ.10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. దీంతో ప్రత్యక్ష, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది – ఇది ఏపీ ఎకనమీకి ఊతం! మరోవైపు, కణేకల్లు హులికెరలో S-144 అత్యాధునిక బ్లేడ్ ఉత్పత్తి లైన్ను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1,700 MW సామర్థ్యం ఉన్న సుజ్లాన్, 2030 నాటికి 5K MW లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వంతో భారీ రాయితీలు పొందిన సుజ్లాన్ తక్కువ ధరకే కరెంటు ఇస్తుందని ఆశిద్దాం.

స్మార్ట్ కార్డు.. స్మార్ట్ సమస్యలు?
Local· 24 Aug 2026

స్మార్ట్ కార్డు.. స్మార్ట్ సమస్యలు?

నర్సంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం స్టార్ట్ అయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ కార్డుదారులకు కొత్త కార్డులు అందజేశారు. ఇక క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు, సరుకులు డైరెక్ట్‌గా అందుతాయని ఆమె చెప్పారు. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. పేర్లు, చిరునామాలు తప్పుగా ప్రింట్ కావడం, వృద్ధులకు ఫింగర్ ప్రింట్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తితే ఆటోమెటిక్ గా కార్డులు క్యాన్సల్ కూడా అవుతాయి. అప్పుడు రేషన్ సరుకులు అందవు. ముందే చెక్ చేసుకుంటే మంచిది. తర్వాత బాధలు అనవసరం.

కొత్త బస్టాండ్.. పాత కష్టం
Local· 24 Aug 2026

కొత్త బస్టాండ్.. పాత కష్టం

కామారెడ్డి కొత్త బస్టాండ్ – పేరు కొత్తే కానీ, పరిస్థితి పాతదే! కాస్త వర్షం కురిస్తే చాలు, బస్టాండ్ చుట్టూ నీళ్లే నీళ్లు. డ్రైనేజీ అంటూ ఏదీ లేకపోవడంతో నీరు అక్కడే నిలిచిపోతోంది. ప్రయాణికులు కాలికింద గుంతలు, బురద. వాహనాలు ఏ స్టాప్‌లో దిగాలో తెలియక సతమతమవుతున్నాయి. ఇక బస్సు ఎక్కేందుకు ప్రజలు ఇబ్బంది పడటం రోజువారీ దృశ్యం. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా? పక్కా డ్రైనేజీ, గుంతల పూడ్చి శాశ్వత పరిష్కారం – ఇదే ప్రజల డిమాండ్. కొత్త భవనాలు మస్తు కట్టొచ్చు. కష్టాలు పోతేనే కదా పరిష్కారం.

పరకాల-అంబాల రోడ్డు.. c/o బురద
Local· 24 Aug 2026

పరకాల-అంబాల రోడ్డు.. c/o బురద

పరకాల నుంచి అంబాలకు వెళ్లే రహదారి ఇప్పుడు బురద మడుగులా మారింది. ఓ వైపు వర్షం కురిస్తే చాలు – రోడ్డంతా నీళ్లు, మట్టి, బురదే. స్కూటీలు, కార్లు, ఆటోలన్నీ ఈ బురదలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నాయి. పాదచారులు బురదలో కాలు పెడితే బూట్లు ఊడిపోయే ప్రమాదం! ప్రతీ వర్షానికి ఇదే పాత కథ – మరమ్మత్తు పేరుతో సాధారణ ప్యాచ్‌వర్క్, మళ్లీ అదే అవస్థ. అందుకే ఇప్పుడు గ్రామస్థులంతా డిమాండ్ పెడుతున్నారు – కొత్తగా డ్యూరబుల్ రోడ్డు వేయాలి, ఆఫీసర్లు స్పందించాలి. ఇప్పటికైనా రిపేరింగ్ మొదలెడితే, ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు!

ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్
Local· 24 Aug 2026

ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

TG: ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. దరఖాస్తుదారుల సమస్యలను అధికారులు బాధ్యతగా నమోదు చేసుకుని, ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలన్నారు.

భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్
Local· 24 Aug 2026

భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్‌లో పట్టపగలే దొంగతనం చేసే ప్రయత్నం జరగడంతో ప్రజలు భయపడిపోయారు. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సాంబరెడ్డి, అహల్య దంపతులను దొంగలు వెంబడించారు. అహల్య మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ లాక్కునేందుకు చూడగా, అది తెగి ఆమె మెడలోనే పడిపోవడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. వెంటనే ఆ దొంగ వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న ఇంకో వ్యక్తితో కలిసి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి CCTV కెమెరాల్లో రికార్డయింది.