← Back to news

'మెహందీ' కోసం భారీ క్యూ.. గణేష్ ఆలయానికి భక్తులు

By Mahesh· 1d ago· Newindianexpress· Rajasthan

రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లోని మోతీ డూంగ్రీ గణేశ్ ఆలయంలో ‘మెహందీ ఉత్సవ్‌’కు వైరల్ రీల్స్‌ భారీ క్రేజ్‌ తెచ్చాయి. సింజారా మెహందీ పెట్టుకుంటే త్వరగా పెళ్లి అవుతుందన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా ఆలయానికి భక్తులు వచ్చారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 18 లక్షల మంది వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 3వేల 5 వందల కిలోల మెహందీని సిద్ధం చేయగా.. మూడు గంటల్లోనే మొత్తం స్టాక్ అయిపోయింది. భక్తులు 6 నుంచి 7 గంటలు క్యూలో వేచి ఉండటంతో అక్కడ ట్రాఫిక్‌ భారీగా పెరిగింది.

More in Viral

అంబానీ ఇంట గణేశ్ వేడుకలు.. టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్!
Viral· 6h ago

అంబానీ ఇంట గణేశ్ వేడుకలు.. టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్!

ముఖేశ్ అంబానీ ఇంట యాంటీలియాలో జరిగిన వినాయక చవితి, గణేశ్ నిమజ్జన వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భర్త మైఖేల్ బూలోస్, తల్లి మార్లా, కొడుకు అలెగ్జాండర్‌తో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్ ట్రెడిషనల్ లుక్‌లో టిఫనీ ఆకట్టుకున్నారు. డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన పిస్టాచియో-గ్రీన్ లెహెంగా, పింక్ దుపట్టాతో పాటు పోల్కీ జువెలరీతో మెరిశారు. ఈ వేడుకల ఫొటోలను ఆమె <a href="https://www.instagram.com/p/DdWw7lwmzw9/?img_index=1">ఇన్‌స్టాగ్రామ్‌లో</a> షేర్ చేశారు.