అమరావతిలో నిర్మాణంలో మినీ అమెజాన్

అమరావతిలోని 300 ఎకరాల శాఖమూరు పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.17.58 కోట్లతో సరికొత్త కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ (మినీ అమెజాన్) ఏర్పాటు కానుంది. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. ఇక్కడ మియావాకి పద్ధతిలో 20 వేల మొక్కలను పెంచుతారు. పర్యాటకులకు నిజమైన అడవి అనుభూతిని ఇవ్వడానికి రైన్ గన్స్, మిస్ట్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లోపలి ఉష్ణోగ్రతను 4 డిగ్రీలు తగ్గిస్తాయి. విద్యార్థుల కోసం నాలెడ్జ్ సెంటర్, కేఫ్ కూడా అందుబాటులోకి రానున్నాయి.



