మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ

మధ్యాహ్న భోజన పథకంలో వారానికోసారి చికెన్ బిర్యానీ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీచర్స్ యూనియన్స్ చేసిన ఈ సూచనను CM విజయ్ పరిశీలిస్తున్నారు. చికెన్ బిర్యానీ యాడ్ చెయ్యడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడంతో పాటు స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతారని భావిస్తున్నారు. 1956లో తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ మొదలు పెట్టిన ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గడంతో మే 2001 నుంచి దేశమంతా అమల్లోకి తెచ్చారు. 2021 ‘PM పోషణ్’అని పేరు మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలకు చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది?


